
కోరం ప్రకారమే ఎన్నికలు నిర్వహించాలి
రాయచోటి టౌన్ : వీఎస్ఎస్ ఎన్నికలు కోరం ప్రకారమే నిర్వహించాలని వంగిమళ్ల గ్రామం నాయనివారిపల్లె గ్రామ ప్రజలు రాయచోటి ఫారెస్టు అధికారులకు వినతి చేశారు. శనివారం వీరబల్లి మండలం వగిమళ్ల గ్రామం నాయనివారిపల్లెలో వృక్ష సంరక్షణ సమతి(వీఎస్ఎస్) ఎన్నికలు నిర్వహించారు. ఈ ఎన్నికలు సజావుగా నిర్వహించాల్సి ఉండగా.. అధికార పార్టీ నాయకుల వత్తిడికి తలొగ్గి టీడీపీకి చెందిన వారినే వీఎస్ఎస్ సంఘం నాయకులుగా గుర్తించారనే ఆరోపణలు ఉన్నాయి. ఈ ఎన్నికలలో తమకు న్యాయం జరగలేదని అధికార పార్టీకి చెందిన వారినే గెలుపొందినట్లు రికార్డులలో రాసుకున్నారని, ఈ పద్ధతి సరైనది కాదని ఆరోపిస్తూ ఆ ప్రాంతానికి చెందిన అర్హత కలిగిన అభ్యర్థులు ఎఫ్ఆర్వో వై.చంద్రశేఖర్రెడ్డికి వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఎఫ్ఆర్వో మాట్లాడుతూ కోరం ప్రకారం సభ్యులు ఉంటేనే ఎన్నికలు నిర్వహిస్తామని చెప్పారు. మొత్తం ఓట్లలో 51 శాతం ఓట్ల శాతం ఉన్నప్పుడే ఈ ఎన్నికలు నిర్వహిస్తామని చెప్పారు. కోరం ప్రకారం ఎన్నికలు జరగకపోతే కోర్టును శ్రయించవచ్చునని సూచించారు. దీనిపై రాయచోటి డీఎఫ్వో వై.చంద్రశేఖర్రెడ్డిని వివరణ కోరగా.. ఆ గ్రామంలో ఉన్న స్థానికుల సహకారంతో కోరం ప్రకారమే ఎన్నికలు నిర్వహిస్తామన్నారు. దీనిపై స్థానిక ప్రజలకు అవగాహన కూడా కల్పించామని చెప్పారు. ఈ ఎన్నికలు సజావుగా జరగకపోతే, త్వరలోనే ఎన్నికల నియవాళి ప్రకారం ఎన్నికలు నిర్వహిస్తామని చెప్పారు. ఎలాంటి రాజకీయాలకు తావు లేకుండా ఎన్నికలు నిర్వహిస్తామని పేర్కొన్నారు.