
మిట్స్ జాతీయ సింపోజియంలో మాజీ రాష్ట్రపతుల మనవడు
కురబలకోట : భారత మాజీ రాష్ట్రపతులు సర్వేపల్లి రాధాకృష్ణన్, వీవీ గిరి మనవడు డాక్టర్ జి. సుబ్రమణ్యం శర్మ అంగళ్లులోని మిట్స్ ఇంజినీరింగ్ కళాశాల బుధవారం జాతీయ స్థాయిలో నిర్వహించిన టెక్నికల్ సింపోజియం జీమాక్స్–25లో ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈయన బెంగళూరు సుధీక్ష గ్రూప్ ఆఫ్ కంపెనీస్ మేనేజింగ్ డైరెక్టర్గా కొనసాగుతున్నారు. ఆయన సింపోజియంలో మాట్లాడుతూ విద్యార్థులు లక్ష్యం కోసం పని చేసి జీవితంలో రాణించాలన్నారు. యువ ఇంజినీర్లు ప్రాజెక్టు ఆధారిత అభ్యాసం ద్వారా పరిశ్రమల అవసరాలకు తగ్గ ట్లు నైపుణ్యాలను పెంచుకోవాలన్నారు. సరికొత్త ఆవిష్కరణలకు తెరలేపాలని సూచించారు.
బాలిక అదృశ్యం
పెద్దతిప్పసముద్రం : మండలంలోని తుమ్మరకుంట పంచాయతీ కొత్తపల్లికి చెందిన ఓ మైనర్ బాలిక (17) గత రెండు రోజుల క్రితం అదృశ్యమైంది. బంధువులు, చుట్టు పక్కల గ్రామాల్లో బాలిక ఆచూకీ లేకపోవడంతో అదృశ్యమైనట్లు భావించిన బాధిత కుటుంబీకులు పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు సమాచారం.