
అన్నమాచార్య యూనివర్సిటీలో పారామెడికల్ కోర్సులు ప్రారంభ
రాజంపేట : అన్నమాచార్య యూనివర్సిటీలో ఆరోగ్య శాస్త్రాల శాఖ (పారామెడికల్ వింగ్స్)ను ప్రారంభించామని అన్నమాచార్య యూనివర్సిటీ చాన్సలర్ చొప్పా గంగిరెడ్డి తెలిపారు. బుధవారం స్థానిక ఏయూ ఆడిటోరియంలో ఏర్పాటు చేసిన తొలి బ్యాచ్ విద్యార్థులకు ఓరియంటేషన్ ప్రోగ్రాంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ బీఎస్సీ అనస్థీషియా టెక్నాలజీ అండ్ ఆపరేషన్ టెక్నాలజి, మెడికల్ ల్యాబ్, బీపీటీ కోర్సులు ఆరోగ్య రంగంలో ప్రాధాన్యత వహిస్తున్నాయన్నారు. నేటి ఆరోగ్య వ్యవస్థలో పారా మెడికల్ కోర్సులు కీలక పాత్ర పోషిస్తున్నాయన్నారు. ఫిజియోఽథెరపీ ఇప్పుడు డిమాండ్ ఉన్న కోర్సు అన్నారు. ఏయూ వీసీ డాక్టర్ సాయిబాబారెడ్డి మాట్లాడుతూ ప్రాథమిక ఆరోగ్య సేవల నుంచి ప్రత్యేక చికిత్స వరకు ప్రతి రంగంలో పారామెడికల్ నిపుణుల అవసరం ఉందన్నారు. ఏఐటీఎస్ చైర్మన్ చొప్పా ఎల్లారెడ్డి, పారామెడికల్ ఇన్చార్జి డాక్టర్ ద్వారకానాథరెడ్డిలు హాజరయ్యారు.