
ప్రణాళిక బద్ధంగా చదివితే ఐఐటీ, నీట్లో ర్యాంకు తథ్యం
కడప కోటిరెడ్డిసర్కిల్ : విద్యార్థులు ప్రణాళిక బద్ధంగా చదివితే నీట్ పరీక్షల్లో ర్యాంకు సాధించడం తథ్యమని విద్యా వేత్త రాహుల్ తెలిపారు. రాయచోటిలోని శ్రీ సాయి కాన్సెప్ట్ స్కూలులో ఏర్పాటు చేసిన అవగాహన సదస్సులో ఐఐటీ, నీట్ ఫౌండేషన్ కోర్సుల ప్రాముఖ్యతను తెలియజేశారు. 2025–26 సంవత్సరం నుంచి శ్రీ సాయి కాన్సెప్ట్ స్కూలులో రిసోర్సెస్ పద్ధలో ఐఐటీ, నీట్ బోధనను 6వ తరగతి నుంచి పదవ తరగతి విద్యార్థులకు బోధిస్తారన్నారు. కార్యక్రమంలో శ్రీ సాయి విద్యాసంస్థల డైరెక్టర్ హీరా రాజు, శ్రీ సాయి కాన్సెప్ట్ స్కూల్ హెడ్మాస్టర్ త్యాగరాజన్తోపాటు పలువురు ఉపాధ్యాయులు, విద్యార్థులు వారి తల్లిదండ్రులు పాల్గొన్నారు.