
డాక్టరమ్మ.. విధులకు డుమ్మా
సిద్దవటం : మండలంలోని పి. కొత్తపల్లె ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యాధికారిణి డాకర్ రంగలక్ష్మి బుధవారం విధులకు గైర్హాజరయ్యారు. ఇక్కడి ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఇద్దరు వైద్యులు పనిచేస్తున్నా డాక్టర్ శ్రీనివాసులరెడ్డి 104 సంచార వాహనం ద్వారా వైద్య సేవలను అందించేందుకు వెళ్లారు. మరో డాక్టర్ రంగలక్ష్మి విధులకు రాకపోవడంతో అక్కడి స్టాఫ్ నర్సు వచ్చిన రోగులకు వైద్య సేవలను అందిస్తున్నారు. డాక్టరమ్మ వారానికి ఒక్కసారే వైద్య శాలకు వస్తారని, హాజరు పట్టికలో ఆమె విధులకు హాజరైన రోజున వారానికి సరిపడా సంతకాలు చేస్తున్నట్లు బట్ట బయలైంది. ఈనెల 25వ తేదీ వరకు హాజరు పట్టికలో వైద్యురాలు సంతకాలు చేశారు. ఆ తర్వాత నుంచి ఏప్రిల్ 30వ తేదీ వరకు సంతకాలు చేసిన దాఖలాలు లేవు. జిల్లా కలెక్టర్ స్పందించి చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు.
రోగులకు అందుబాటులో ఉండని
పి. కొత్తపల్లె వైద్యాధికారిణి

డాక్టరమ్మ.. విధులకు డుమ్మా