అతివేగం తెచ్చిన అనర్థం | - | Sakshi
Sakshi News home page

అతివేగం తెచ్చిన అనర్థం

Apr 29 2025 7:01 AM | Updated on Apr 29 2025 7:01 AM

అతివే

అతివేగం తెచ్చిన అనర్థం

రైల్వేకోడూరు అర్బన్‌/నందలూరు: రైల్వేకోడూరు మండలంలోని అనంతరాజుపేట గుండాలేరు బ్రిడ్జి వద్ద జాతీయ రహదారిపై సోమవారం తెల్లవారుజామున నందలూరు నుంచి తిరుపతికి వెళుతున్న ఆటోను అతివేగం కారణంగా నియంత్రణ కోల్పోయిన లారీ ఢీకొంది. ఈ సంఘటనలో ఆటో నుజ్జు నుజ్జయింది.నందలూరుకు చెందిన పి.జహరాబీ (60), పి.సుహేల్‌ఖాన్‌ (15)లు అక్కడికక్కడే మృతి చెందారు.ఆటోలో ఉన్న రహీముల్లా, ఫరిహానా, సుహానాఖాన్‌, షాహీదా, అబ్దుల్లాలకు గాయాలయ్యాయి. గాయపడిన వారిని 108 ద్వారా స్థానిక ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. తిరుపతిలో నివాసముంటున్న రహీముల్లా నందలూరులోని అత్తగారి ఇంటికి వచ్చాడు. ఒక రోజు ఉండి వేసవి సెలవులు కావడంతో బంధువులను తిరుపతిలోని తన ఇంటికి ఆటోలో తీసుకుని బయలుదేరాడు. మార్గమధ్యంలో అనంతరాజుపేట వద్ద రాజంపేట వైపు వెళుతున్న టీఎన్‌88ఎల్‌807 నంబర్‌ గల లారీ ఢీ కొనడంతో ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందారు. లారీ డ్రైవర్‌ రఘురామన్‌ను అదుపులోకి తీసుకొని కేసు నమోదు చేసినట్లు ఎస్‌ఐ నవీన్‌బాబు తెలిపారు.

ఆటోను ఢీకొన్న లారీ

ఇద్దరు మృతి : అయిదుగురికి గాయాలు

అతివేగం తెచ్చిన అనర్థం 1
1/4

అతివేగం తెచ్చిన అనర్థం

అతివేగం తెచ్చిన అనర్థం 2
2/4

అతివేగం తెచ్చిన అనర్థం

అతివేగం తెచ్చిన అనర్థం 3
3/4

అతివేగం తెచ్చిన అనర్థం

అతివేగం తెచ్చిన అనర్థం 4
4/4

అతివేగం తెచ్చిన అనర్థం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement