
నేడు ప్రజా సమస్యల పరిష్కార వేదిక
రాయచోటి: ప్రజల నుంచి సమస్యలను స్వీకరించి, వాటిని పరిష్కరించేందుకు సోమవారం ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమా న్ని నిర్వహించనున్నట్లు కలెక్టర్ ఛామకూరి శ్రీధర్ తెలిపారు. ఈ మేరకు ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. అన్నమయ్య జిల్లా కేంద్రమైన రాయచోటితోపాటు గ్రామ, మండల, డివిజన్ స్థాయి కార్యాలయాల్లోనూ ప్రజలు ఫిర్యాదులను అందజేయొచ్చని వివరించారు.
14 నుంచి బ్రహ్మోత్సవాలు
రాజంపేట రూరల్: శ్రీలక్ష్మీనరసింహస్వామి బ్రహ్మోత్సవాలను మే 10వ తేది నుంచి 14వ తేది వరకు ఘనంగా నిర్వహించనున్నట్లు మాజీ మంత్రి పసుపులేటి బ్రహ్మయ్య కుమారుడు పసుపులేటి వీరప్రదీప్కుమార్ తెలిపారు. మండల పరిధిలోని భువనగిరిపల్లి వద్ద నున్న లక్ష్మనరసింహస్వామి దేవస్థానంలో ఆదివారం బ్రహ్మోత్సవాల పోస్టర్లను, లగ్నపత్రికలను ఆలయ ధర్మకర్తలతో కలిసి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 13వ తేది కన్నుల పండువగా కల్యాణం నిర్వహించనున్నట్లు తెలియజేశారు. ఉమ్మడి వైఎస్సార్ జిల్లాలోని భక్తులు, మహిళలు ఈ బ్రహ్మోత్సవాలలో పాల్గొనాలని కోరారు.
11న దూదేకుల
విద్యార్థులకు పురస్కారం
కడప వైఎస్ఆర్ సర్కిల్: పదో తరగతి, ఇంటర్మీ డియెట్లో అత్యధిక మార్కులు సాధించిన దూదేకుల విద్యార్థులకు మే 11న నగరంలోని ఎర్రముక్కపల్లె దూదేకుల జిల్లా భవన్లో ప్రతిభా పురష్కారాలు అందజేస్తున్నట్లు ఏపీ నూర్ బాషా దూదేకుల, బీసీ, ముస్లిం సంక్షేమ సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు గగ్గుటూరి చిన్న రాజా పేర్కొన్నారు. ఆదివారం నగరంలోని దూదేకుల సంక్షేమ భవన్లో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు. తమ సంఘంతోపాటు కడప నూర్ భాష దూదేకుల సంక్షేమ సంఘం సంయుక్త ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం చేపడుతున్నట్లు తెలిపారు. 2024–25 విద్యా సంవత్సరానికి సంబంధించి ఇంటర్మీడియట్లో 950, పదో తరగతిలో 560కు పైగా మార్కులు సాధించిన వారు మే 9 లోపు దరఖాస్తు చేసుకోవాలని కోరారు. మరిన్ని వివరాలకు 9440677839, 9441276127, 7780441172, 9951667362 అనే ఫోన్ నంబర్లను సంప్రదించాలన్నారు. ఈ కార్యక్రమంలో సంఘం జిల్లా అధ్యక్షుడు సుంకేసుల బాషా, నాయకులు ఖాదరయ్య, ఓబులేసు, కమాల్ బాషా తదితరులు పాల్గొన్నారు.