పశువులకు తప్పని ఇబ్బందులు | - | Sakshi
Sakshi News home page

పశువులకు తప్పని ఇబ్బందులు

Apr 28 2025 12:11 AM | Updated on Apr 28 2025 12:11 AM

పశువు

పశువులకు తప్పని ఇబ్బందులు

వైఎస్‌ జగన్‌ హయాంలో రైతులకు వరంగా ఉన్న పశు ఆరోగ్య సంచార వాహనాలను కూటమి ప్రభుత్వం పట్టించుకోలేదు. ఈ కారణంగా పశు వైద్య సేవలకు ఇబ్బందులు ఎదురవుతున్నాయి. గతంలో పశువుల వద్దకే వచ్చి సేవలు అందించేవారు. ముఖ్యంగా పశువైద్య శాలలు అందుబాటులో లేని ప్రాంతాలకు వరంగా ఉండేవి. టోల్‌ ఫ్రీ నంబరు ఉండేది. మారుమూల గ్రామలకు వెళ్లి తగిన సేవలు చేస్తూ వచ్చారు. ఉన్నట్టుండి సంచార వాహనాలను నిలిపి వేయడంతో దిక్కుతోచని పరిస్థితి ఎదురవుతోంది.

– మొలక గోపాల్‌ రెడ్డి, పాడి ఆవుల రైతు,

మొలకవారిపల్లె, కురబలకోట మండలం

మే 1 నుంచి అందుబాటులోకి వాహనాలు

జిల్లాలో ప్రస్తుతం ఫిబ్రవరి 1 నుంచి ఆగిపోయిన ఆరు పశు సంచార వాహనాలను మే నెల 1వ తేదీ నుంచి నడిపేందుకు చర్యలు తీసుకుంటున్నారు. పబ్లిక్‌ ప్రైవేటు భాగస్వామ్యంతో ప్రస్తుతం కాంట్రాక్టు కుదిరింది. ఈ నేపథ్యంలో మేనెల నుంచి వీటిని నడిపేందుకు ప్రభుత్వం అనుమతించింది. ప్రస్తుతానికి ఏడు వాహనాలతో జిల్లాలో వైద్యసేవలకు ఇబ్బంది లేకుండా చూసుకుంటున్నాం. మిగిలినవి కూడా అందుబాటులోకి వస్తే పూర్తి స్థాయిలో వైద్య సేవలు అందిస్తాం.

– గుణశేఖర్‌ పిళ్లై, జిల్లా పశుసంవర్దకశాఖ

అధికారి, రాయచోటి, అన్నమయ్య జిల్లా

పశువులకు తప్పని ఇబ్బందులు 
1
1/1

పశువులకు తప్పని ఇబ్బందులు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement