
ఉగ్రదాడి మృతులకు నివాళి
జమ్ముకాశ్మీర్లోని పహెల్గాం ఉగ్రదాడిలో ప్రాణాలు కోల్పోయిన వారికి అన్నమాచార్య యూనివర్సిటీ అధ్యాపకులు,విద్యార్థులు శుక్రవారం రాత్రి నివాళులు అర్పించారు. ఉగ్రదాడిని నిరసిస్తూ కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా వీసీ మాట్లాడుతూ కొవ్వొత్తుల ర్యాలీ వల్ల విద్యార్ధులలో దేశభక్తి, సామాజికబాధ్యత పెంపొందించవచ్చని తెలిపారు. బాధిత కుటుంబాలకు తమ ప్రగాఢ సానుభూతిని తెలియచేస్తూ, భగవంతుడు వారికి మనోధైర్యం ప్రసాదించాలని అందరూ ప్రార్ధించారు.కార్యక్రమంలో వీసీ డాక్టర్ సాయిబాబారెడ్డి, రిజిస్ట్రార్ డాక్టర్ మల్లికార్జునరావు, ఏఐటీఎస్ ప్రిన్సిపాల్ డా.నారాయణ, పరిపాలనాధికారి సుబ్బారెడ్డి తదితరులు పాల్గొన్నారు. –రాజంపేట