
ఇంటింటికి వెళ్లి చెత్తను సేకరించాలి
జిల్లా కలెక్టర్ శ్రీధర్ చామకూరి
పెద్దమండ్యం: గ్రామాల్లో ఇంటింటికి వెళ్లి చెత్తను సేకరించాలని జిల్లా కలెక్టర్ శ్రీధర్ చామకూరి అన్నారు. పెద్దమండ్యంలో డంపింగ్ యార్డ్ను శుక్రవారం ఆయన పరిశీలించారు. రోజువారీగా చెత్త సేకరణపై పంచాయతీ కార్యదర్శిని అడిగి తెలుసుకున్నారు. అలాగే యాప్లో రోజువారీగా చెత్త సేకరణ వివరాలను అప్లోడ్ చేస్తున్నారా లేదా అనే విషయమై ఆరా తీశారు. అనంతరం స్థానిక తహసీల్దార్ కార్యాలయంలో శాఖలవారీగా అధికారులతో సమీక్షించారు. గ్రామాల్లో ఉన్న డంపింగ్ యార్డ్లను వినియోగంలోకి తీసుకురావాలని గ్రామ కార్యదర్శులను ఆదేశించారు. సకాలంలో ఇంటి పన్నులు వసూలు చేయాలన్నారు. పక్కాగృహాల నిర్మాణంపై సమీక్షించారు. కాలనీలలో గృహ నిర్మాణాల పురోగతిపై సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. గృహ నిర్మాణాలు వేగవంతం చేయాలని ఆదేశించారు. కార్యాలయం వద్ద ప్రజలు, ప్రజా ప్రతినిధులు పలు సమస్యలను కలెక్టర్ దృష్టికి తీసుకొచ్చారు. ఆకుమానిగుట్ట నిర్మాణంతో భూములు కోల్పోయిన రైతులకు భూ పరిహారం, అర్ధంతరంగా ఆగిపోయిన నల్లరాతిమడుగు ప్రాజెక్టు నిర్మాణం పనుల గురించి ఎంపీపీ గుర్రం పూర్ణచంద్రిక కలెక్టర్కు వివరించారు. అనంతరం స్థానిక ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని కలెక్టర్ తనిఖీ చేశారు. పీహెచ్సీలో రికార్డులను పరిశీలించారు.పీహెచ్సీలో జరుగుతున్న ప్రసవాల గురించి ఆరా తీశారు. ఆసుపత్రికి వచ్చే రోగులకు మెరుగైన వైద్య సేవలు అందించాలన్నారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ సయ్యద్అహ్మద్, ఎంపీడీవో శ్రీధర్రావు, ఆర్డబ్ల్యూఎస్ డీఈ చంద్రశేఖరరెడ్డి, ఏపీడీ నందకుమార్రెడ్డి, ఆర్డబ్ల్యూఎస్ ఏఈ అశోక్కుమార్, హౌసింగ్ ఏఈ అక్రమ్, ట్రాన్స్కో ఏఈ రామ్మూర్తినాయక్ తదితరులు పాల్గొన్నారు.