
సారా రహిత జిల్లాగా మారుద్దాం
రాయచోటి టౌన్: జిల్లాను సారా రహితంగా మార్చేందుకు అందరం కలిసికట్టుగా కృషి చేద్దామని ఉమ్మడి జిల్లా ఎకై ్సజ్ డిప్యూటీ కమిషనర్ జయరాజ్ పేర్కొన్నారు. శుక్రవారం జిల్లా కేంద్రంలోని ప్రొహిబిష, ఎకై ్సజ్ శాఖ కార్యాలయంలో నవోదయ– 2– కార్యక్రమంలో భాగంగా జిల్లాను నాటు సారా రహితంగా మార్చేందుకు ఎలాంటి చర్యలు చేపట్టాలనే అంశాలపై చర్చించారు. జిల్లాలో వాయల్పాడు, మదనపల్లె, మొలకల చెరువు, పీలేరు నాటుసారా ప్రభావిత ప్రాంతాలని, వీటిని నాటుసారా రహితంగా చేసేందుకు చర్యలు చేపట్టాలన్నారు. ఆయా ప్రాంతాల్లో పాత నేరస్తులను గుర్తించి బైండోవర్ చేయాలని చెప్పారు. సారా తయారీ ప్రదేశాలను గుర్తించేందుకు డ్రోన్ కెమెరాలను ఉపయోగించాలని తెలిపారు. కార్యక్రమంలో జిల్లా ఎకై ్సజ్శాఖ అసిస్టెంట్ కమిషనర్ చంద్రశేఖర్ రెడ్డి, జిల్లా ప్రొహిబిషన్, ఎకై ్సజ్ అధికారి మధుసూధన్, అసిస్టెంట్ ఎకై ్సజ్ సూపరింటెండెంట్ జోగేంద్ర, తదితరులు పాల్గొన్నారు.