ఎనిమిది మంది స్మగ్లర్లు అరెస్టు | - | Sakshi
Sakshi News home page

ఎనిమిది మంది స్మగ్లర్లు అరెస్టు

Apr 26 2025 12:40 AM | Updated on Apr 26 2025 12:40 AM

ఎనిమిది మంది స్మగ్లర్లు అరెస్టు

ఎనిమిది మంది స్మగ్లర్లు అరెస్టు

వీరబల్లి : వీరబల్లి అటవీ పరిధిలో ఎనిమిది మంది ఎర్రచందనం స్మగ్లర్లను అరెస్టు చేసి వారి నుంచి 12 ఎర్రచందనం దుంగలతో పాటు ఒక మోటారు సైకిల్‌ను శుక్రవారం టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఎర్రచందనం అక్రమ రవాణ నిరోధక టాస్క్‌ ఫోర్స్‌ (ఆర్‌ఎస్‌ఏఎస్టీఎఫ్‌) ఆర్‌ఐ సాయి గిరిధర్‌, ఆర్‌ఎస్‌ఐ విశ్వనాథ్‌ బృందం స్థానిక ఎస్‌బీఓ అనీల్‌కుమార్‌తో కలిసి అన్నమ్యయ్య జిల్లా వీరబల్లి అటవీ ప్రాంతంలో కూంబింగ్‌ చేపట్టారు. శుక్రవారం ఉదయం క్వారీ పాయింట్‌ వద్ద కొందరు వ్యక్తులు మోటారు సైకిల్‌తో కనిపించారు. వీరిని చూసి పారిపోవడానికి ప్రయత్నించగా అప్రమత్తమై చుట్టుముట్టి పట్టుకున్నట్లు టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు తెలిపారు. చుట్టు ప్రక్కల దాచిన 12 ఎర్రచందనం దుంగలు, మోటారు సైకిల్‌ స్వాధీనం చేసుకున్నారు. పట్టుబడిన వారు తమిళనాడుకు చెందిన వారుగా గుర్తించామన్నారు. వారిని తిరుపతి టాస్క్‌ఫోర్స్‌ పోలీస్‌ స్టేషన్‌కు తరలించగా వారిని డీఎస్పీలు శ్రీనివాసులు రెడ్డి, షరీఫ్‌లు విచారించారు. ఈ మేరకు ఎస్‌ఐ రఫీ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

12 ఎర్రచందనం దుంగలు,

ఒక మోటారు సైకిల్‌ స్వాధీనం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement