
ఇందిరమ్మ కాలనీలో ఉద్రిక్తత
గుర్రంకొండ : గుర్రంకొండ ఇందిరమ్మ కాలనీలో ఇరువర్గాల మధ్య ఘర్షణతో ఉద్రిక్తత తలెత్తింది. ఇందిరమ్మ కాలనీకి చెందిన ఓ మహిళ కడప–బెంగుళూరు జాతీయ రహదారిపై టి.దుకాణం నిర్వహిస్తూ జీవనం సాగిస్తోంది. ఈ మహిళ తన భర్తతో సహజీవనం చేస్తోందని ఆరోపిస్తూ స్థానిక పెద్దపాళెం వీధికి చెందిన మరో మహిళ కొందరిని వెంటబెట్టుకుని వచ్చి నిలదీసింది. తనకు ఎలాంటి సంబంధం లేదని టీ దుకాణం నిర్వహించే మహిళ వాగ్వాదానికి దిగడంతో ఇరు వర్గాల వారు పెద్ద ఎత్తున గుమిగూడి ఘర్షణకు దిగారు. ఒక వర్గానికి చెందిన వారు టీ.దుకాణాన్ని ధ్వంసం చేశారు. మరోవర్గం రెచ్చిపోయి దాడులకు పాల్పడ్డారు. ఎస్ఐ మధురామచంద్రుడు చేరుకొని ఇరువర్గాలను చెదరగొట్టి కొందరిని పోలీస్ స్టేషన్కు తరలించారు. అక్కడ పెద్ద ఎత్తున జనం చేరుకోవడంతో ఉద్రిక్తత నెలకొంది. చేసేదేమీల లేక పోలీసలు పోలీస్ స్టేషన్ గేట్లు మూసివేశారు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.