సాంకేతిక ధోరణులపై అవగాహన | - | Sakshi
Sakshi News home page

సాంకేతిక ధోరణులపై అవగాహన

Mar 28 2025 1:33 AM | Updated on Mar 28 2025 1:33 AM

రాజంపేట : పరిశ్రమలలో మారుతున్న సాంకేతిక ధోరణులపై విద్యార్థులకు స్పష్టమైన అవగాహన ఉండాలని అన్నమాచార్య యూనవర్సిటీ ప్రో–చాన్స్‌లర్‌ చొప్పా అభిషేక్‌రెడ్డి అన్నారు. ట్రైనింగ్‌ అండ్‌ ప్లేస్‌మెంట్‌ విభాగం ఆధ్వర్యంలో ఏఐటీఎస్‌ ఆడిటోరియంలో గురువారం అవగాహన సదస్సు నిర్వహించారు. చొప్పా అభిషేక్‌రెడ్డి మాట్లాడుతూ విద్యార్ధులు ఎప్పటికప్పుడు సాంకేతిక పరిజ్ఞానం పెంపొందించేందుకు ఏయూ సదస్సులు నిర్వహించడం జరుగుతోందన్నారు. సాఫ్ట్‌వేర్‌ సంస్ధలకు చెందిన వారితో ప్రసంగాలు చేయిస్తున్నామన్నారు. కౌత్‌ సాఫ్ట్‌వేర్‌ సంస్థ సీఈఓ డా.కృష్ణ నాగరాజన్‌ మాట్లాడుతూ తమ సంస్ధ రూపొందించిన కోడెక్‌లను ప్రపంచ వ్యాప్తంగా టెలికాం సంస్ధలు వినియోగిస్తున్నాయన్నారు. ఆర్కెటెక్‌ పుత్తూరు మోహన్‌రెడ్డి మాట్లాడుతూ తాజా సాంకేతికఅంశాలపై విద్యార్ధులు పట్టు సాధించాలన్నారు. ఈ కార్యక్రమంలో వీసీ డా.సాయిబాబారెడ్డి, ప్రిన్సిపల్‌ డా.ఎంవీ.నారాయణ, టీపీఓలు హేమకేశవులు, సత్యేంద్రకుమార్‌, రమేష్‌బాబు పాల్గొన్నారు. అనంతరం నిపుణులను ఏయూ ప్రో–చాన్స్‌లర్‌ చొప్పా అభిషేక్‌రెడ్డి ఘనంగా సన్మానించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement