సుండుపల్లె : రాతికూసాలను, ఇనుప తంతిని ధ్వంసం చేసిన ఐదుగురు వ్యక్తులపై కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ ముత్యాల శ్రీనివాసులు తెలిపారు. పోలీసుల వివరాల మేరకు.. మండల కేంద్రానికి సమీపంలోని బుర్రలదిన్నెపల్లె గ్రామంలో కామిని శ్రీను అనే వ్యక్తి మామిడి తోటకు పొలానికి చుట్టుపక్కల రాతి కూసాలను ఏర్పరచుకుని ఇనుప తంతిని నిర్మించుకున్నాడు. అతనికి బంధువు అయిన కామిని అంజనమ్మ మరో నలుగురు వ్యక్తులు అతని పొలంలోకి అక్రమంగా ప్రవేశించి సుమారు 40 రాతి కూసాలను, ఇనుప తంతిని ధ్వంసం చేసి నష్టం చేకూర్చారు. కామిని శ్రీను ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ ముత్యాల శ్రీనివాసులు తెలిపారు.
ప్రమాదవశాత్తు భవన నిర్మాణ కార్మికుడి మృతి
రాజంపేట : పట్టణంలోని ఆర్ఎస్ రోడ్లోని రాఘవేంద్ర ప్రొవిజెనల్స్ సమీపంలో నిర్మాణంలో ఉన్న భవనం పై నుంచి ముద్దా మల్లికార్జున (35) అనే భవన నిర్మాణ కార్మికుడు కిందపడి మృతి చెందాడు. ఈ మేరకు అర్బన్ పోలీసులు కేసు నమోదు చేశారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం రాజంపేట ఏరియా ఆసుపత్రికి తరలించారు. కాగా కూలిపనుల నిమిత్తం ఒంగోలు నుంచి వచ్చిన భవన నిర్మాణ కూలీల బృందంలో ఇతను ఒకడిగా గుర్తించారు.
మహిళ మెడలో గొలుసు చోరీ
మదనపల్లె : ఇంటి ముందు ముగ్గువేస్తున్న మహిళ మెడలో గుర్తు తెలియని వ్యక్తి బలవంతంగా గొలుసు చోరీ చేసిన ఘటన మంగళవారం మదనపల్లెలో జరిగింది. పట్టణంలోని జోగప్పగారివీధికి చెందిన నాగభూషణం భార్య వెంకటలక్షుమ్మ(67) తెల్లవారుజామున 5 గంటల సమయంలో ఇంటి ముందు ముగ్గువేస్తుండగా, గుర్తు తెలియని వ్యక్తి ముసుగు ధరించి వచ్చి మహిళ మెడలో నుంచి బలవంతంగా చైను లాక్కుని పరారయ్యాడు. చోరీ ఘటనపై బాధితురాలు టూటౌన్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. బంగారు గొలుసు సుమారు 12 గ్రాములు బరువుతో పాటు రూ.60వేలు విలువ చేస్తుందని ఫిర్యాదులో పేర్కొంది. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు టూటౌన్ సీఐ రామచంద్ర తెలిపారు.
రోడ్డుపై మోల్డింగ్
వాహనం బోల్తా
– ఒడిస్సా వాసి దుర్మరణం
బి.కొత్తకోట : కర్ణాటకలోని రాయల్పాడులో ఓ ఇంటికి మోల్డింగ్ పనికోసం వెళ్తున్న వాహనం మార్గమధ్యంలో బి.కొత్తకోట మండలంలో బోల్తా పడింది. అందులో ప్రయాణిస్తున్న కూలీల్లో ఒక రు ఘటనా స్థలంలోనే దుర్మరణం చెందారు. పో లీసుల కథనం మేరకు వివరాలు.. మంగళవారం బి.కొత్తకోట నుంచి ఆరుగురు కూలీలతో రాయల్పాడులో మోల్డింగ్ పనుల కోసం వాహనం బయలుదేరింది. దాని వెనుక మిల్లర్ను తగిలించుకుని వెళ్తుండగా మొటుకుపల్లె పంచాయతీ టేకులపెంటకు సమీపంలోని దొక్కలవంక వద్ద వాహనం అదుపుతప్పి బోల్తా పడింది. ఈ ఘట నలో ఒడిస్సా రాష్ట్రానికి చెందిన కె.సింహాచలం (40) తీవ్ర గాయాలతో దుర్మరణం చెందాడు. మిగిలిన కూలీలకు రక్త గాయాలయ్యాయి. ఈ ఘటనపై స్థానిక కరెంట్ కాలనీలో ఉంటున్న మృతుని భార్య ఊర్మిల డ్రైవర్ శ్రీనివాసులు అజాగ్రత్తగా వాహనం నడపడం వల్లే ప్రమాదం జరిగి తన భర్త మృతి చెందాడని పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈమేరకు కేసు నమోదు చేసినట్లు సీఐ జీవన్ గంగనాఽథ్బాబు తెలిపారు.
భూ వివాదంలో ఐదుగురిపై కేసు నమోదు