ప్రకృతిని ప్రేమించండి.. భవిష్యత్తును కాపాడండి | - | Sakshi
Sakshi News home page

ప్రకృతిని ప్రేమించండి.. భవిష్యత్తును కాపాడండి

Mar 25 2025 1:24 AM | Updated on Mar 25 2025 1:23 AM

ఒంటిమిట్ట : అడవులు మనకు జీవనాధారం, పచ్చదనాన్ని పరిరక్షించడం మనందరి బాధ్యత. ఈ విషయాలను ప్రాక్టికల్‌గా అర్థం చేసుకునేలా ఒంటిమిట్ట అటవీశాఖ ఆధ్వర్యంలో విద్యార్థులకు ఒక ప్రత్యేకమైన ప్రకృతి అవగాహన శిబిరం నేచర్‌ క్యాంప్‌ సోమవారం ఏర్పాటు చేశారు. ఒంటిమిట్ట మండల కేంద్రంలోని శ్రీ సాయి భారతి ఉన్నత పాఠశాల విద్యార్థులు సోమశిల వెనుక జలాలు కలిగిన కుడమలూరు గ్రామంలో మంటపంపల్లి గ్రామ శివారులోని వనమిత్రలో నిర్వహించిన ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. ఈ సందర్భంగా ప్రకృతిలో అనుభూతిని పొందేలా అటవీ సంపదను కళ్లారా చూసేలా ప్రత్యేకమైన ఈ క్యాంప్‌ విద్యార్థులకు కొత్త ప్రపంచాన్ని పరిచయం చేసిందని ట్రైనీ ఐఎఫ్‌ఎస్‌ అధికారి శ్రీకాంత్‌ తెలిపారు. ఈ కార్యక్రమంలో డీఆర్‌ఓ నాగు నాయక్‌, ఎఫ్‌ఎస్‌ఓ బ్రహ్మయ్య, నర్సరీ ఎఫ్‌బీఓ బాషా, సరోజ, పాఠశాల ప్రధానోపాధ్యాయుడు సుబ్బరామయ్య, ఉపాధ్యాయుడు రాజ, అటవీశాఖ అధికారులు, పాఠశాల సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

శిక్షణ ఐఎఫ్‌ఎస్‌ అధికారి శ్రీకాంత్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement