మదనపల్లె : పట్టపగలే ఆగంతకుడు ఇంట్లోకి చొరబడి వృద్ధురాలిని బెదిరించి బంగారు గొలుసు చోరీ చేసిన ఘటన సోమవారం మదనపల్లెలో జరిగింది. దేవళంవీధికి చెందిన రాజమ్మ(80)కు ఇద్దరు కుమారులు ఉన్నారు. అయితే, ఆమె ఒంటరిగా మరో ఇంట్లో ఉంటోంది. సోమవారం ఉదయం 11.30 గంటల సమయంలో సుమారు 25 సంవత్సరాలు వయస్సు కలిగిన యువకుడు తలకు టోపీ, మఖానికి మాస్కు, చేతులకు గ్లౌజులు ధరించి వృద్ధురాలి ఇంట్లోకి చొరబడ్డాడు. వృద్ధురాలిని గొంతునులిమి బెదిరించి మెడలోని సుమారు 30 గ్రాముల బంగారు గొలుసుతో పాటు మరో 5 గ్రాముల చెవి కమ్మను బలవంతంగా లాక్కుని పరారయ్యాడు. బాధిత వృద్ధురాలు వన్టౌన్ పోలీస్ స్టేషన్కు చేరుకుని చోరీ ఘటనపై ఫిర్యాదు చేసింది. పోలీసులు, వృద్ధురాలి ఇంటి సమీపంలోని సీసీ టీవీ పుటేజీని పరిశీలించగా, మాస్క్ ధరించిన వ్యక్తి చోరీ చేసి పారిపోతుండటాన్ని గుర్తించారు. ఘటనపై కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నట్లు వన్టౌన్ సీఐ ఎరీషావలీ తెలిపారు.
పట్టపగలే వృద్ధురాలి మెడలో గొలుసు చోరీ