కడప అర్బన్ : న్యాయశాఖ ఉద్యోగుల బ్యాడ్మింటన్ టోర్నమెంట్ విజేతలుగా నాగరాజు – నితిన్ జోడి నిలిచింది. కడప నగరం పక్కీరుపల్లెలోని పీవీఆర్ ఇండోర్ స్టేడియంలో న్యాయశాఖ ఉద్యోగుల బ్యాడ్మింటన్ టోర్నమెంట్ ముగింపు కార్యక్రమం సోమవారం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా జిల్లా అదనపు న్యాయమూర్తి రామారావు, జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి ఎస్. బాబా ఫక్రుద్దీన్ హాజరై విజేతలను అభినందించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ బ్యాడ్మింటన్ టోర్నమెంట్లో క్రీడాకారులు అందరూ ఎంతో ఉత్సాహంగా పాల్గొని చక్కటి క్రీడా స్ఫూర్తిని ప్రదర్శించారని అభినందించారు. కాగా టోర్నీలో రన్నరప్గా నరసింహారెడ్డి – ప్రభాకర్ రెడ్డి జోడీ నిలిచింది.
అంతర్జాతీయ అంపైర్ జిలానీ బాషాకు సత్కారం
అంతర్జాతీయ అంపైర్గా బ్యాడ్మింటన్ క్రీడాభివృద్ధికి కృషి చేస్తున్న జిల్లాకు చెందిన ఎస్. జిలానీబాషాను టోర్నమెంట్ సందర్భంగా ఘనంగా సన్మానించారు. అంతర్జాతీయ అంపైర్గా రాణిస్తూ ఉండడంతో పాటు ఉమ్మడి తెలుగు రాష్ట్రాల నుంచి బ్యాడ్మింటన్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా రెఫరీ సెలక్షన్ కమిటీ అసెసర్ గా ఎంపిక కావడంపై జిల్లా బ్యాడ్మింటన్ సంఘం ప్రతినిధులు, న్యాయశాఖ ఉద్యోగులు అభినందించారు. ఈ కార్యక్రమంలో జిల్లా బ్యాడ్మింటన్ సంఘం ఆర్గనైజింగ్ సెక్రటరీ నాగరాజు, జిల్లా న్యాయశాఖ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు శశికాంత్ రెడ్డి, కోశాధికారి గుప్తా, కృష్ణ ప్రసాద్, అహ్మద్, బ్యాడ్మింటన్ సంఘం ప్రతినిధులు సోనీ శ్యామూల్, వెన్నెల తదితరులు పాల్గొన్నారు.
రన్నరప్గా నరసింహారెడ్డి – ప్రభాకర్ రెడ్డి