లక్కిరెడ్డిపల్లి : మండలంలోని అనంతపురం గంగమ్మ తల్లికి వేలాది మంది భక్తులు ఆదివారం బోనాలు సమర్పించి తలనీలాలు అర్పించి మొక్కులు తీర్చుకున్నారు. జాతర ముగిసిన తరువాత మూడవ ఆదివారం కావడంతో చుట్టు పక్కల ప్రాంతాలకు చెందిన భక్తులే కాకుండా వివిధ ప్రాంతాల నుంచి వేలాది మంది భక్తులు ఆలయానికి తరలిరావడంతో అమ్మవారి దర్శనం కోసం వేకువజాము నుంచే క్యూలైన్లో భక్తులు వేచి ఉండాల్సి వచ్చింది. లక్కిరెడ్డిపల్లి పోలీసులతోపాటు ప్రత్యేక అధికారి శ్రీనివాసులు, ఆలయ పూజారులు చెల్లు గంగరాజు, దినేష్ యాదవ్, రామచంద్ర, వెంకటేష్, గురుస్వామి , రెడ్డి శేఖర్, బోస్ యాదవ్, సాయిలు భక్తులకు అమ్మవారి దర్శనాన్ని కల్పించే విధంగా చొరవచూపుతూ అమ్మవారి తీర్థప్రసాదాలను భక్తులకు అందజేశారు. ఎండ తీవ్రత అధికంగా ఉండటంతో భక్తులకు చలువ పందిళ్లు ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ మానవత స్వచ్ఛంద సంస్థ సభ్యులు ప్రసాద్ యాదవ్, రవికుమార్, షఫీ, నాయక్, ఆలయ సిబ్బంది, భక్తులు తదితరులు పాల్గొన్నారు.