చెట్టుపై నుంచి పడి వ్యక్తికి తీవ్ర గాయాలు | - | Sakshi
Sakshi News home page

చెట్టుపై నుంచి పడి వ్యక్తికి తీవ్ర గాయాలు

Mar 24 2025 5:55 AM | Updated on Apr 3 2025 1:21 PM

నిమ్మనపల్లె : చెట్టుపై నుంచి పడి ఓ వ్యక్తి తీవ్రంగా గాయపడిన సంఘటన ఆదివారం నిమ్మనపల్లె మండలంలో జరిగింది. గంగాపురంపల్లెకు చెందిన రామకృష్ణ(52) స్థానికంగా చింతకాయలు కోసేందుకు కూలి పనులకు వెళ్లాడు. చెట్టు ఎక్కి కాయలు కోస్తుండగా, ప్రమాదవశాత్తు చెట్టుపై నుంచి కింద పడి తీవ్రంగా గాయపడ్డాడు. 

తలకు తీవ్ర గాయమై చెవులు, ముక్కుల నుంచి రక్తంకారి అపస్మారక స్థితికి వెళ్లాడు. దీంతో గమనించిన స్థానికులు హటాహుటిన మదనపల్లె ప్రభుత్వ జిల్లా ఆస్పత్రికి 108 వాహనంలో తరలించారు. అత్యవసర విభాగంలో వైద్యచికిత్స అందించినా పరిస్థితి విషమంగా ఉండటంతో మెరుగైన వైద్యం కోసం తిరుపతికి రెఫర్‌ చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement