
● రూ.406 కోట్లు ఎగ్గొట్టిన ప్రభుత్వం
కూటమి ప్రభుత్వం హామీ ఇచ్చినట్టుగా అన్నదాత సుఖీభవ పథకం ద్వారా ప్రతి రైతుకు రూ.20వేల ఆర్థిక సహాయం అందాలి. 2024–25లో ఈ పథకాన్ని అమలు చేయకపోవడంతో రైతులు ప్రభుత్వం నుంచి పొందాల్సిన సాయాన్ని నష్టపోయారు. కేంద్రప్రభుత్వం ఇచ్చే రూ.6,500 వాటా సొమ్ము పక్కనపెట్టి రాష్ట్ర వాటా రూ.13,500 ఇచ్చినా జిల్లా రైతాంగానికి రూ.406.74 కోట్ల ఆర్థిక సహాయం అందాలి. 2023–24లో వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో అందించిన రైతుభరోసా రైతుల సంఖ్య మేరకు పై సహాయం అందాలి. తాజా లెక్కలను పరిగణలోకి తీసుకుంటే రైతుల సంఖ్య పెరగడంతోపాటు అన్నదాత సుఖీభవ సాయం కూడా పెరుగుతుంది.