
దెబ్బతిన్న అరటితోటలను నేడు వైఎస్ జగన్ పరిశీలన
పులివెందుల: మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి సోమవారం ఉదయం 8.30 గంటలకు పులివెందుల నివాసం నుంచి బయలుదేరి లింగాల మండలంలో అరటి తోటలను పరిశీలిస్తారు. తాజాగా తీవ్ర ఈదురుగాలులతో లింగాల మండలంలో వేల ఎకరాలలో పంట నష్టం జరిగింది. నష్టపోయిన అరటి రైతులతో మాట్లాడతారు. అనంతరం వేంపల్లెలో జెడ్పీటీసీ రవి నివాసంలో జరిగే శుభకార్యానికి హాజరవుతారు. తర్వాత ఇడుపులపాయ చేరుకుని అక్కడి నుంచి బయలుదేరి సాయంత్రం తాడేపల్లి చేరుకుంటారు.
నేడు ప్రజా సమస్యల
పరిష్కార వేదిక
రాయచోటి: ప్రజల నుంచి సమస్యలను స్వీకరించి వాటిని పరిష్కరించేందుకు సోమవారం ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమన్ని నిర్వహి ంచనున్నారు. ఈ విషయాన్ని జిల్లా కలెక్టర్ చామ కూరి శ్రీధర్ ఆదివారం ఒక ప్రకటనలో పేర్కొ న్నారు. అన్నమయ్య జిల్లా కేంద్రం రాయచోటితోపాటు గ్రామ, మండల, డివిజన్ స్థాయిలో ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు కలెక్టర్ తెలిపారు.
నేడు గోవిందమాంబ
ఆరాధన మహోత్సవం
బ్రహ్మంగారిమఠం: శ్రీ పోతులూరు వీరబ్రహ్మేంద్రస్వామి ధర్మపత్ని మాతా గోవిందమాంబ ఆరాధన మహోత్సవం సోమవారం నిర్వహించనున్నారు. ఇందుకోసం నిర్వాహకులు అన్ని ఏర్పాట్లు చేశారు. అమ్మవారికి ఉదయం నుంచి సాయంత్రం వరకు ప్రత్యేక పూజలు, అభిషేకాలు, హోమాలు చేయనున్నారు.
నేడు రాయచోటిలో ర్యాలీ
రాయచోటి అర్బన్: ప్రపంచ క్షయవ్యాధి నివారణ దినోత్సవాన్ని పురస్కరించుకుని సోమ వారం పట్టణంలో ర్యాలీ నిర్వహిస్తున్నట్లు డీఎంహెచ్ఓ డాక్టర్ కొండయ్య, అదనపు డీఎంహెచ్ఓ, జిల్లా టీబీ పోగ్రాం అధికారిణి శైలజ ఒక ప్రకటనలో తెలిపారు. ర్యాలీ స్థానిక ప్రభుత్వ ఏరియా ఆసుపత్రి నుంచి నేతాజి సర్కిల్ మీదుగా ఆర్టీసీ బస్టాండ్ వరకు సాగుతుందన్నారు. అనంతరం ఎన్జిఓ సబాభవనంలో సమావేశం జరుగుతుందని తెలిపారు. ఈ సందర్భంగా ఈ ఏడాది నిర్వహించిన టీబీ నివారణ కార్యక్రమాల్లో ఉత్తమ ప్రతిభ కనబరిచిన వారికి, టీబీ ముక్తభారత్లో ఎంపికై న పంచాయతీలకు అవార్డులను ప్రదానం చేయనున్నట్లు వారు తెలిపారు.
29న నాటక ప్రదర్శనలు
రాజంపేట టౌన్: అన్నమయ్య 522వ వర్ధతిని పురస్కరించుకొని ఈనెల 29వ తేదీ రాత్రి 7 గంటల నుంచి తాళ్లపాక ధ్యానమందిరం ఆవరణలో ఉచితంగా నాటకాలను ప్రదర్శించనున్నారు. ఈ విషయాన్ని అన్నమయ్య కళాకారుల ఐక్యవేదిక రాజంపేట అధ్యక్షుడు జబ్బిరెడ్డి వెంకటరెడ్డి ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. తిరుపతి అన్నమాచార్య ప్రాజెక్టు ఆధ్వర్యంలో నాటకాల ప్రదర్శన జరుగుతుందని తెలిపారు. ఇందులో భాగంగా శ్రీరామాంజనేయ యుద్దసీను, శ్రీకృష్ణరాయబారంలోని మయసభ సన్నివేశం, పడక సీను, కర్ణసందేశం, బాలనాగమ్మ నాటకంలోని సన్నివేశాలను ప్రముఖ కళాకారులు ప్రదర్శిస్తారని చెప్పారు.