రాయచోటి జగదాంబసెంటర్: రాష్ట్ర ప్రభుత్వం నాఫెడ్ వారి ఆధ్వర్యంలో ఏపీ మార్క్ఫెడ్ జిల్లాలో కంది పండించిన, ఈ క్రాప్ చేయించుకున్న రైతుల నుంచి మద్ధతు ధరపై ఒక క్వింటాల్ రూ.7,550 చొప్పున కందులు కొనుగోలు చేసేందుకు అనుమతి ఇచ్చిందని ఏపీ మార్క్ఫెడ్ జిల్లా మేనేజర్ త్యాగరాజు ఒక ప్రకటనలో తెలిపారు. ఆదివారం నుంచి మదనపల్లె, ములకలచెరువు మార్కెట్యార్డుల్లో కందుల కొనుగోలు ప్రక్రియను ప్రారంభిస్తున్నట్లు చెప్పారు. రైతు సేవా కేంద్రంలో పేర్లు నమోదు నమోదు చేయించుకోవాలన్నారు. కేవలం ఈ క్రాప్ నమోదు చేసుకున్న రైతుల నుంచి మాత్రమే కొనుగోలు చేస్తామని, తేమశాతం 12 శాతం లోపల ఉండేలా చూసుకోవాలన్నారు. మరిన్ని వివరములకు 9052567983 నంబర్లలో సంప్రదించాలని ఆయన తెలిపారు.
లేగ దూడల ప్రదర్శన
సంబేపల్లె: మండల పరిధిలోని శెట్టిపల్లె పంచాయతీ వల్లబండపల్లె సమీపంలో పశుసంవర్ధకశాఖ ఆధ్వర్యంలో శనివారం లేగదూడల ప్రదర్శన నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా పశుసంవర్ధకశాఖాధికారి గుణశేఖర్పిల్లై మాట్లాడుతూ గడ్డిపెంచడం, గాలి కుంటు వ్యాధి నివారణ టీకాలు సకాలంలో పాడిపశువులకు వేయించుకోవాలన్నారు.వ్యాధులపట్ల అప్రమత్తంగా ఉండాలని, పశు వైద్యుల సూచనలు పాటించాలని తెలిపారు. కార్యక్రమంలో పశువైద్యులు శ్రీధర్రెడ్డి, మాజీ జెడ్పీటీసి నరసారెడ్డి తదితరులు పాల్గొన్నారు.
దరఖాస్తుల ఆహ్వానం
రాయచోటి టౌన్: జిల్లాలోని గిరిజన గురుకుల సంక్షేమ పాఠశాలలో ప్రవేశాల కోసం దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు జిల్లా గిరిజన సంక్షేమ శాఖ అధికారి డి. సురేష్ శనివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. జిల్లాలోని రాయచోటి, పీలేరు ( కెవీపల్లెలో) ఉన్న బాలికల గురుకుల పాఠశాలలో 2025–2026కు సంబంధించి ఖాళీలు ఇలా ఉన్నాయి.
5వ తరగతికి సంబంధించి రిజర్వేషన్ ప్రకారం దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు తెలిపారు. వీటిలో ఎస్టీలకు సంబంధించి (అన్ని తెగలకు చెందిన ఎస్టీలు)64, ఎస్సీ –10, బీసీ–04, ఇతరులు 2 మొత్తం 80 ఖాళీలు ఉన్నట్లు తెలిపారు. పూర్వపు కడప విద్యార్థినిలు చేసుకోవాలన్నారు. దరఖాస్తులకు చివరి తేది ఈ నెల 25వ తేదీ. మరిన్ని వివరాల కోసం 94411 46908 / 73822 64994/ 94414 94161 నంబర్లలో సంప్రదించాలని చేయవల్సిందిగా డి. సురేష్ తెలిపారు.
క్షయవ్యాధిపై
అవగాహన అవసరం
గుర్రంకొండ: క్షయవ్యాధి(టీబీ)పై తప్పనిసరిగా అవగాహన కలిగి ఉండాలని జిల్లా ఆరోగ్య విద్యాధికారి మహమ్మద్రఫీ అన్నారు. శనివారం స్థానిక ప్రభుత్వ తెలుగు జూనియర్ కళాశాలలో అంగన్వాడీ కార్యకర్తలకు టీబీ , క్యాన్సర్ వ్యాధులపై అవగాహన సదస్సు నిర్వహించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ. టీబీకి వ్యతిరేకంగా మనిషిలో రోగనిరోధక శక్తిని పెంచడానికి ఈ సదస్సులు ఎంతగానో ఉపయోగపడ తాయన్నారు. రెండువారాలకు పైబడి దగ్గు ఉన్నవారు తప్పనిసరిగా ప్రభుత్వాస్పత్రిలో వైద్య పరిక్షలు చేయించు కోవాలన్నారు. గళ్ల పరీక్షలు చేసి వ్యాధి నిర్ధారణ అయితే ఆరునెలల పాటు మందులు డాట్స్ ద్వారా అందిస్తామన్నారు. టీబీ రోగులకు పోషకాహారం కోసం ప్రతినెలా రూ.1000 అందిస్తామన్నారు. క్షయవ్యాధిలేని సమాజం కోసం అందరం కృషి చేయాలన్నారు. ఇంటింటి క్యాన్సర్ పరిక్షలు నిర్వహించేకార్యక్రమం త్వరల్లో జరుగుతుందన్నారు. అనంతరం కరపత్రాలను పంపిణీ చేశారు. ఈకార్యక్రమంలో వైద్యాధికారి రవీంద్రనాయక్, హెల్త్సూపర్వైజర్ నాగరాజు, ఆంగన్వాడీకార్యకర్తలు పాల్గొన్నారు.
తరగతి రాయచోటి కెవిపల్లె (పీలేరు)
5 80 80
6 39 64
7 06 55
8 00 46
9 01 46
మద్దతు ధరపై కందుల కొనుగోలు