సుండుపల్లె మండల పరిధిలోని మల్లక్కగారిపల్లె సమీపంలో నీరు లేక వెలవెలబోతున్న వ్యవసాయ మోటారు బావులు
సాక్షి రాయచోటి: వేసవి ప్రారంభమైందో...లేదో భానుడి ప్రభావం తీవ్రంగా కనిపిస్తోంది. ఒకవై ఎండ సెగలు, మరోవైపు గాలుల ధాటికి నీరు ఆవిరవుతోంది. 2024లో కరువు ప్రభావంతో వర్షపాతం అంతంత మాత్రంగా నమోదు కావడం....దానికితోడు చెరువులు,కుంటల్లో జలాలు కూడా లేకపోవడంతో ప్రస్తుతం పరిస్థితి ఇబ్బందికరంగా మారుతోంది. రోజురోజుకు నీటిమట్టాలు పాతాళంలోకి చేరుతుండడంతో అందరిలోనూ ఆందోళన నెలకొంది. ప్రధానంగా ఇటు తాగునీటితోపాటు సాగునీటికి కూడా సంకటం మొదలైంది.
ఇంకిపోతున్న జలం
జిల్లాలో భూగర్బ జలమట్టం రోజురోజుకు ఇంకిపోతోంది. ఉదాహరణకు జనవరిలో బోరులో రెండు ఇంచుల నీరొస్తుండగా, ప్రస్తుతం ఒక ఇంచుకు పడిపోయిన పరిస్థితి కళ్లేదుటే కనిపిస్తోంది. రోజురోజుకు ఎండ ప్రభావం పెరిగే కొద్ది మరింత విపత్కర పరిస్థితులు ఎదుర్కోవాల్సి వస్తోంది. . ఇప్పటికే జిల్లా వ్యాప్తంగా ఎక్కడ చూసినా బావులతోపాటు బోర్లలోనూ నీటిమట్టం తగ్గిన పరిస్థితులు స్పష్టంగా కనిపిస్తున్నాయి.
పంటలపై ప్రభావం
ఎండలు పెరిగే కొద్ది పంటలపై తీవ్ర ప్రభావం కనిపిస్తోంది. బోర్లలో నీటిమట్టం తగ్గుతుండడంతో రైతుల్లో ఆందోళన నెలకొంది. జిల్లాలో ప్రధానంగా సాగులో ఉన్న మామిడి తోటలకు సంబంధించి రైతన్నలు ఇబ్బందులు పడుతున్నారు. అంతేకాకుండా దోస, టమోటా, ఇతర పండ్ల తోటలతోపాటు కూరగాయల పంటలకు సంబంధించి కూడా బోర్లలో నీరు రోజురోజుకు ఇంకుతున్న నేపధ్యంలో అన్నదాతలు ఆందోళనకు గురవుతున్నారు.
ఎండిపోతున్న నీటి వనరులు
జిల్లాలో చెరువులు, కుంటలు, ప్రాజెక్టుల్లోనూ నీటిమట్టం రోజురోజుకూ పడిపోతోంది. వెలిగల్లు, పెద్దేరు, శ్రీనివాసపురం, ఝరికోన, బాహుదా ఇలా అన్ని నీటి వనరుల్లోనూ నీటిమట్టం పడిపోతోంది. మరోవైపు జిల్లాలోని చెరువులు, కుంటలు, నదులు, బోరు బావులు, బావుల్లోనూ నీటి మట్టం తగ్గిపోయింది. దీంతో తాగునీటి సమస్య తలెత్తుతుందని అధికారులు ఆందోళన చెందుతుండగా, రైతులు కూడా నీరు తగ్గిపోతుండడంతో ఒకింత ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
బోరు
బావులు:
63,570
మొత్తం
పెద్ద
చెరువులు: 154
జిల్లా మూడో అదనపు జడ్జి ప్రవీణ్కుమార్
భూగర్భంలో జలం...ఆందోళనలో జనం
రోజురోజుకు తగ్గిపోతున్న నీటి మట్టం
ఎండ ప్రభావంతో ఇంకిపోతున్న ప్రాజెక్టులు, చెరువులు, కుంటలు
చట్టాలపై పాఠశాల స్థాయి నుంచి అవగాహన