యథేచ్ఛగా నార్కోటిక్స్, మత్తు, స్టెరాయిడ్స్ విక్రయాలు
డాక్టర్ చీటీ లేకుండా మందులు అమ్మితే కఠినచర్యలు
మదనపల్లె : రాష్ట్రవ్యాప్తంగా మెడికల్ షాపుల్లో ఎన్ఫోర్స్మెంట్ విభాగాలైన విజిలెన్స్, ఈగల్, డ్రగ్ కంట్రోల్తో పాటు పోలీసులు బృందాలుగా ఏర్పడి నిర్వహించిన ఆపరేషన్ గరుడ శుక్రవారం రాత్రి మదనపల్లెలో జరిగింది. పట్టణంలోని మూడు రిటైల్ మందుల షాపులు, ఒక హోల్సేల్ షాపులో నిర్వహించిన డెకాయ్ ఆపరేషన్లో...డాక్టర్ ప్రిస్క్రిప్షన్ చీటీ లేకుండా మందులు విక్రయిస్తున్నట్లు, మందులకు బిల్లు లేకుండా అమ్మకాలు చేస్తున్నట్లు గుర్తించామని డ్రగ్ ఇన్స్పెక్టర్ కేశవరెడ్డి తెలిపారు.
మెడికల్ షాపుల్లో నార్కోటిక్స్, మత్తు కలిగించే మందులు, యాంటీబయాటిక్స్, స్టెరాయిడ్స్ వైద్యుల సిఫారసు లేకుండానే విక్రయిస్తున్నట్లు తనిఖీల్లో తేలిందన్నారు. రెండు షాపుల్లో ఫార్మసిస్ట్ లేకుండానే, బిల్లులు వేయకుండానే మందులు విక్రయిస్తున్నారన్నారు. అలాగే మందుల కొనుగోలు, విక్రయాల మధ్య తేడాలు ఉన్నట్లు గుర్తించామన్నారు. డెకాయ్ ఆపరేషన్లో తాము గమనించిన లోపాలపై నివేదిక తయారుచేసి ఉన్నతాధికారులకు పంపి వారి ఆదేశాల మేరకు తగు చర్యలు తీసుకుంటామన్నారు. మందుల షాపుల్లో ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా విక్రయాలు జరిపితే కఠినచర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
మత్తు, నార్కోటిక్, స్టెరాయిడ్స్ తదితర ఔషధాలు వైద్యుల సిఫారసు, చీటీ లేకుండా, బిల్లులు వేయకుండా అమ్మకూడదని తెలిపారు. అమ్మకాలు జరిపిన వెంటనే వాటి వివరాలను హెచ్–1 రిజిస్టర్లో నమోదుచేయాలని, లేనిపక్షంలో అలాంటివాటిపై కఠినచర్యలు తీసుకుంటామని తెలిపారు. దాడుల్లో జిల్లా విజిలెన్స్, ఎన్ఫోర్స్మెంట్ అధికారులు జే.మురళీకృష్ణ(ఎఫ్ఆర్ఓ), కే.వి.కిశోర్(ఏఈఈ), వి.నాగరాజు(సీఐ), కానిస్టేబుల్స్ టిప్పుసుల్తాన్, రాజీవ్కుమార్, రంగనాథ్లు పాల్గొన్నారు.
కడప – బెంగళూరు రైల్వే పనులను పూర్తి చేయాలి
కడప ఎడ్యుకేషన్ : కడప బెంగుళూరు రైల్వే పనులను 20 సంవత్సరాల క్రితం మెదలు పెట్టినప్పటికీ అప్పటి నుంచి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నిర్మాణ పనులను పూర్తి చేయడంలో పూర్తిగా వైఫల్యం చెందాయని వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధి వేదిక రాష్ట్ర అధ్యక్షుడు బి నారాయణ రెడ్డి, ఉపాధ్యక్షుడు సిఆర్వి ప్రసాద్ అన్నారు. శనివారం వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధి వేదిక కమిటీ ఆధ్వర్యంలో పబ్బపురం వద్ద కడప బెంగళూరు రైల్వే ట్రాక్ను పరిశీలించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కడప– బెంగళూరు రైల్వే పనులు త్వరగా పూర్తి చేయాలని డిమాండ్ చేశారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రైల్వే లైన్ పూర్తి చేయడంలో పూర్తిగా అలసత్వం వహిస్తున్నాయని ఆరోపించారు.
కూటమి ప్రభుత్వం కేవలం అమరావతి సాకుగా చూపించి రాష్ట్ర బడ్జెట్ అంత అమరావతి కేటాయించాలని చేడటం దారుణం అన్నారు. అభివృద్ధి వికేంద్రీకరణ జరగాలి గాని కేంద్రీకరణ చేయాలనుకోవడం సిగ్గు చేటని వారు దుయ్యబట్టారు. కడప బెంగళూరు రైల్వే లైను పూర్తయితే కడప జిల్లాలో ఎక్కువ మంది రైతులు పండించుకునే ధాన్యాలను కూరగాయలను బెంగళూరు వంటి ప్రాంతాలకు సులువుగా మార్కెటింగ్ చేసుకునే అవకాశం ఏర్పడుతుందన్నారు. అసెంబ్లీలో కానీ, పార్లమెంటులో కడప బెంగళూరు రైల్వే పనులను పూర్తిచేయాలని ఒక్క రాజకీయ నాయకుడు కూడా ప్రస్తావన చేయకపోవడం దారుణం అన్నారు. ఇప్పటికై నా రాయలసీమ ప్రాంతం నుండి ఎన్నికై న ప్రజాప్రతినిధులు రైల్వే పనులను పూర్తిచేయాలని ప్రభుత్వాలపై ఒత్తిడి తీసుకురావాలని డిమాండ చేశారు.
బద్వేలులో యువకుల బాహాబాహి
బద్వేలు అర్బన్ : స్థానిక నాలుగు రోడ్ల కూడలిలో శనివారం డబ్బు బాకీ విషయమై కొందరు యువకులు ఘర్షణకు దిగారు. ఈ ఘటనలో ఇరువర్గాలకు చెందిన ఐదుగురు యువకులపై అర్బన్ పోలీసులు కేసు నమోదు చేశారు. మండల పరిధిలోని చింతలచెరువు బీసీకాలనీకి చెందిన గొడుగునూరునాగరాజు వృత్తి రీత్యా హైదరాబాద్లో ఉంటున్నాడు. అట్లూరు మండలానికి చెందిన కుంభగిరిశివశంకర్ వద్ద నాగరా జు రూ.50 వేలు అప్పుగా తీసుకున్నాడు.
ఈ నేపథ్యంలో ఏడాది కిందట శివశంకర్ హైదరాబాద్కు వెళ్ళి నా గరాజు ద్విచక్ర వాహనాన్ని తీసుకువచ్చాడు. అయితే శనివారం స్థానిక త్యాగరాగకాలనీలో బంధువుల పుట్టువెంట్రుకల కార్యక్రమం ఉండటంతో అందరూ అక్కడ కలిశారు. ఈ సమయంలో మాటమాట పెరగడంతో ఘర్షణకు దిగారు. పోలీసులు ఘర్షణ పడిన వారిని అదుపులోకి తీసుకుని నాగరాజు, శివశంకర్లతో పాటు మరో ముగ్గురిపై కేసు నమోదు చేశారు.

మదనపల్లెలో ఆపరేషన్ గరుడ