రాయచోటి టౌన్ : ఫిర్యాదుదారుల కోసం ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన విద్యుత్ అదాలత్ను వినియోగదారులు సద్వినియోగం చేసుకోవాలని విద్యుత్ అదాలత్ చైర్పర్సన్ వి. శ్రీనివాస్ ఆంజనేయ మూర్తి (రిటైర్డ్ న్యాయమూర్తి) తెలిపారు. శుక్రవారం రాయచోటి విద్యుత్శాఖ వారి కార్యాలయ ఆవరణలో విద్యుత్ వినియోగం వాటిలో వస్తున్న సమస్యలపై అదాలత్ నిర్వహించారు. అదాలత్కు వచ్చిన ఫిర్యాదుదారుల నుంచి ఫిర్యాదులను పరిశీలించి వారికి పరిష్కార మార్గం చూపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇలాంటి అదాలత్లను వినియోగదారులు సద్వినియోగం చేసుకోవాలలన్నారు. రాయచోటి, లక్కిరెడ్డిపల్లె డివిజన్ పరిధిలోని వినియోగదారుల ద్వారా ఫిర్యాదులను స్వీకరించారు. కార్యక్రమంలో అదాలత్ ఆర్థిక సభ్యులు రు. రామమోహన్ రావు, సాంకేతిక సభ్యులు ఎస్ఎల్ అంజనీ కుమార్, స్వతంత్య్ర సభ్యులు డబ్ల్యు విజయలక్ష్మి, విద్యుత్ శాఖ జిల్లా పర్యవేక్షకులు ఆర్. చంద్రశేఖర్రెడ్డి, సీనియర్ అకౌంట్ ఆఫీసర్ సివిబ్రహ్మయ్య, తదితరులు పాల్గొన్నారు.