గుర్తు తెలియని వాహనం ఢీకొని వృద్ధుడు మృతి | - | Sakshi
Sakshi News home page

గుర్తు తెలియని వాహనం ఢీకొని వృద్ధుడు మృతి

Mar 22 2025 1:29 AM | Updated on Mar 22 2025 1:25 AM

బి.కొత్తకోట : జాతీయరహదారి పక్కన నడిచి వెళ్తున్న వృద్ధుడిని గుర్తు తెలియని వాహనం ఢీకొనడంతో దుర్మరణం చెందాడు. ఈ ఘటన శుక్రవారం ఉదయం మండలంలోని పెద్దపల్లి క్రాస్‌లో చోటుచేసుకుంది. సీఐ జీవన్‌ గంగనాఽథ్‌బాబు కథనం మేరకు.. తుమ్మనంగుట్ట, కనికలతోపు, పెద్దపల్లి ప్రాంతాల్లో మూడునెలలుగా గుర్తు తెలియని వ్యక్తి (65) భిక్షాటన చేసుకొంటూ సంచరిస్తున్నాడు. ఇతను ఉదయం 7–8 గంటల మధ్యలో మదనపల్లె వైపు నుంచి కదిరివైపునకు వెళ్తున్న గుర్తు తెలియని వాహనం ఢీకొంది. ఈ ఘటనలో తల, శరీరంపై తీవ్ర గాయాలైన వృద్ధుడు ఘటనా స్థలంలోనే మృతి చెందాడు. సమాచారం అందుకున్న సీఐ ఘటనా స్థలికి చేరుకుని దర్యాప్తు చేపట్టారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం మదనపల్లె జిల్లా ఆస్పత్రికి తరలించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement