రాయచోటి అర్బన్ : చిత్తూరు–తిరుపతి–అన్నమయ్య జిల్లాల్లో ఏనుగుల దాడి నుంచి పంటపొలాలను కాపాడాలని ఏపీ రైతుసంఘం జిల్లా అధ్యక్షుడు వంగిమళ్ళ రంగారెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. శుక్రవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ తిరుపతి జిల్లాలో ఎర్రావారిపాళెం, చిన్నగొట్టిగల్లు, చంద్రగిరి, అన్నమయ్య జిల్లాలో ఓబులవారిపల్లె, చిత్తూరు జిల్లాలోని పలమనేరు, ౖవై.కోట, రామకుప్పం, బంగారుపాళెం, మండలాల్లోని పొలాలు, మామిడి తోటలపై ఏనుగులు దాడిచేసి పంటనష్టాన్ని కలిగించాయన్నారు. ఏనుగుల దాడుల్లో అన్నమయ్య జిల్లాలో ముగ్గురు, చంద్రగిరి వద్ద ఒకరు, ఇన్నగొట్టిగల్లు వద్ద ఒకరు చొప్పున మృత్యుపాలయ్యారన్నారు. దీంతో అటవీ సమీప ప్రాంత రైతులు భయాందోళనలకు గురవుతున్నారన్నారు. ఇప్పటికై నా ప్రభుత్వం ఏనుగుల దాడుల్లో మృతిచెందిన వారి కుటుంబాలకు రూ. 10 లక్షలు చొప్పున నష్టపరిహారం అందివ్వాలన్నారు. నష్టపోయిన పంటలను సైతం అంచనావేసి నష్టపరిహారం చెల్లించడం ద్వారా రైతాంగాన్ని ఆదుకోవాలంటూ కోరారు.