నడిరోడ్డుపై మృతదేహంతో నిరసన | - | Sakshi
Sakshi News home page

నడిరోడ్డుపై మృతదేహంతో నిరసన

Mar 22 2025 1:29 AM | Updated on Mar 22 2025 1:25 AM

తంబళ్లపల్లె : నవీన్‌కుమార్‌ కుటుంబానికి న్యాయం చేయాలని గ్రామస్థులు, మృతుని కుటుంబీకులు, స్నేహితులు మృతదేహాన్ని దుకాణం ముందు రోడ్డుపై ఉంచి శుక్రవారం నిరసన తెలిపారు. మదనపల్లె జిల్లా ఆస్పత్రిలో నవీన్‌ మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించిన అనంతరం మృతదేహాన్ని తంబళ్లపల్లెకు తీసుకువచ్చారు. పుడమి కిసాన్‌మార్ట్‌ దుకాణం ముందు రోడ్డుపై మృతదేహాన్ని ఉంచి నిరసన వ్యక్తం చేశారు. అనంతరం మూడురోడ్ల కూడలిలో రోడ్డుపై బైఠాయించి వాహనాల రాకపోకలను అడ్డుకున్నారు. దుకాణం మేనేజర్‌ కృష్ణమూర్తి అవకతవకలకు పాల్పడి తమ బిడ్డ మృతికి కారణమయ్యాడని ఆరోపించారు. అతనిపై సమగ్ర విచారణ జరిపి తమకు న్యాయం చేయాలని నినదించారు. ఎస్‌ఐ లోకేష్‌రెడ్డి నిరసనకారులతో చర్చించి సమగ్ర విచారణ చేసి న్యాయం చేస్తామని చెప్పినా నిరసనకారులు భీష్మించుకుని కూర్చున్నారు. టీడీపీ ఇన్‌చార్జ్‌ జయచంద్రారెడ్డి బాఽధితుడి కుటుంబ సభ్యులను పరామర్శించారు. సంస్థ యాజమాన్యంతో చర్చించి న్యాయం జరిగే విధంగా కృషి చేస్తామని హామీ ఇచ్చారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement