కురబలకోట పీఠంపై
బి.కొత్తకోట: తంబళ్లపల్లె నియోజకవర్గంలో మరో బీసీ మహిళ ఎంపీపీ పీఠంపై కూర్చో నుంది. బీసీ జనరల్ ఎంపీపీ స్థానమైన కురబలకోట ఎంపీపీగా బీసీ మహిళను ఎమ్మెల్యే పెద్దిరెడ్డి ద్వారకనాధరెడ్డి ఎంపిక చేయగా గురువారం ఎంపీటీసీ సభ్యులు సమావేశమై నందిరెడ్డిగారిపల్లి ఎంపీటీసీ సభ్యురాలు, వైస్ ఎంపీపీ అయిన ఎంజీ.భూదేవిని ఏకగ్రీవంగా ఆమోదించారు. అనంతరం మండల పరిషత్ కార్యాలయ ఏవో నాగరాజుకు వినతిపత్రం అందజేశారు. ఎంపీపీ దస్తగిరిసాబ్ ఆరోగ్య కారణాలతో ఆరునెలల పాటు సెలవులో వెళ్లారు. అప్పటిదాకా ఎంపీపీగా ఒకరు బాధ్యతలను పూర్తిస్థాయిలో చేపట్టి మండల పరిషత్ పాలన సాగించాల్సి ఉంటుంది. దీనికి మొదటి వైస్ ఎంపీపీ ఎన్.వెంకటరమణారెడ్డి ఎంపీపీగా విముఖత చూపారు. రెండో వైస్ ఎంపీపీ భూదేవికి అవకాశం కల్పించారు. మండలంలోని 12 మంది ఎంపీటీసీల్లో ఒకరు స్వతంత్ర అభ్యర్థికాగా మిగిలిన 11 మందిలో ఇద్దరు అరోగ్య కారణాలతో హజరుకాలేదు. మండల పరిషత్ కార్యాలయంలో జరిగిన సమావేశానికి వైఎస్సార్సీపీ ఎంపీటీసీలు ఎం.త్రీవేణి, ఎంజీ.భూదేవి, ఆర్.రవీంద్రారెడ్డి, ఎం.ఆనందరెడ్డి, ఎన్.వెంకటరమణారెడ్డి, డి.నిర్మలమ్మ, వి.గోపాలకృష్ణ, జి.సుశీలమ్మ, జి.సరస్వతమ్మ హజరయ్యారు. తదుపరి ఎంపీపీగా భూదేవి పేరును ఆనందరెడ్డి ప్రతిపాదించగా ఏకగ్రీవంగా ఆమోదం తెలుపుతూ తీర్మానం చేశారు. తర్వాత వినతిపత్రాన్ని ఏవోకు అందజేసి తర్వాతి చర్యలు తీసుకోవా లని కోరారు. ఈ సమావేశానికి వైఎస్సార్సీపీ సర్పంచ్లు విశ్వారెడ్డి, మనోహర్రెడ్డి, ఫిరోజ్ ఖాన్, కృష్ణారెడ్డి, టీఏసీ సభ్యులు దామోదర్రెడ్డి, కోళ్ల వాసుదేవరెడ్డి తదితరులు హజరయ్యారు. ఈ సందర్భంగా భూదేవి మాట్లాడుతూ బీసీ మహిళలకు రాజకీయాల్లో సముచిత స్థానం కల్పిస్తున్న ఎమ్మెల్యే పెద్దిరెడ్డి ద్వారకనాధరెడ్డికి రుణపడి ఉంటామని అన్నారు.
జనరల్ స్థానాల్లో బీసీలు: గత ఎంపీటీసీ ఎన్నికల్లో నియోజకవర్గంలో 72 ఎంపీటీసీ స్థానాల్లో జనరల్ స్థానాల్లో ఎమ్మెల్యే పెద్దిరెడ్డి ద్వారకనాథరెడ్డి బీసీ నేతలకు అవకాశం కల్పించారు. 7 ఎంపీటీసీ సీట్లను బీసీలకే అదనంగా కేటాయించి జనరల్ స్థానాల్లో అభ్య ర్థులుగా పోటీచేయించారు. బి.కొత్తకోట మండలంలోని తుమ్మనగుట్ట ఎంపీటీసీ స్థానం జనరల్ కాగా బీసీ సామాజిక వర్గానికి చెందిన ఖాదర్వలీని ఎంపీటీసీ అయ్యాక వైస్ఎంపీపీ చేశారు. పెద్దతిప్పసముద్రం మండలంలోని పట్టేంవాండ్లపల్లె–2 స్థానం జనరల్ కాగా బీసీ–బీ వర్గానికి చెందిన పి.శోభకు టికెట్ ఇచ్చి గెలిపించారు. పెద్దతిప్పసముద్రం–2 ఎంపీటీసీ స్థానం జనరల్లో బీసీ వర్గానికి చెందిన జి.మహమ్మద్కు టికెట్ ఇచ్చారు. ఆయన్నే పీటీఎం ఎంపీపీ చేశా రు. తంబళ్లపల్లె మండలంలోని ఎద్దులవారిపల్లెకు ఎంపీటీసీ స్థానం జనరల్ కాగా బీసీ వర్గానికి చెందిన సీజీ.హరితకు అవకాశం ఇచ్చారు. కోటాల జనరల్ స్థానంలో బీసీ అయిన చిన్న రామకష్ణకు సీటిచ్చారు. పెద్దమండ్యం మండలంలోని ఎన్ఓ పల్లె ఎంపీటీసీ స్థానం జనరల్ కాగా బీసీ మహిళ జి.చంద్రకళకు అవకాశం ఇచ్చి తర్వాత ఎంపీపీ చేశారు. కోటాకాడపల్లె ఎంపీటీసీ జనరల్ స్థానంలో బీసీ–బీ వర్గానికి చెందిన బి.రవితేజకు అవకాశం కల్పించారు. వీరందరూ విజయం సాధించారు.
ఐదుగురు మహిళలే...
కురబలకోట ఎంపీపీగా భూదేవి బాధ్యతలు చేపడితే నియోజకవర్గంలోని ఆరు మండలాలకు ఐదుగురు మహిళలే ఎంపీపీలు అవుతారు. ఇప్పటికే పెద్దమండ్యం, ములకలచెరువు ఎంపీపీలు బీసీ మహిళలు, బి.కొత్తకోట ఎస్సీ మహిళ, తంబళ్లపల్లె జనరల్ మహిళ, ఇప్పుడు కురబలకోట ఎంపీపీగా భూదేవి బీసీ మహిళ అవుతారు. పెద్దతిప్పసముద్రం ఎంపీపీ మొహమూద్ బీసీ. దీంతో బీసీ ఎంపీపీల సంఖ్య నాలుగుకు చేరుతుంది.
ఎమ్మెల్యే పెద్దిరెడ్డి ద్వారకనాథరెడ్డి నిర్ణయం
ఎంపీటీసీల ఏకగ్రీవ తీర్మానం
ఇకపై ఐదుగురు ఎంపీపీలు మహిళలే
బీసీలు ఎదగాలి
వెనుబడిన తంబళ్లపల్లె నియోజకవర్గంలో బీసీ సామాజిక వర్గం రాజకీయాల్లో ఎదగాలి. బీసీల అభివృద్ధి, రాజకీయ ప్రాధాన్యత మాటల్లో కాక చేతల్లో చూపించాం. అందుకనే కురబలకోట ఎంపీపీగా బీసీ మహిళకు మద్దతు ఇచ్చాం. అన్ని పార్టీలు బీసీల రాజకీయ అభ్యున్నతికి అండగా నిలవాలి. –పెద్దిరెడ్డి ద్వారకనాథరెడ్డి,
తంబళ్లపల్లె ఎమ్మెల్యే
బీసీ మహిళ