ఉప రాష్ట్రపతిని కలిసిన రాజ్యసభ సభ్యుడు మేడా | - | Sakshi
Sakshi News home page

ఉప రాష్ట్రపతిని కలిసిన రాజ్యసభ సభ్యుడు మేడా

Mar 19 2025 1:32 AM | Updated on Mar 19 2025 1:28 AM

రాజంపేట : ఉపరాష్ట్రపతి జగదీప్‌ధన్కర్‌ను రాజ్యసభ సభ్యుడు మేడా రఘునాథరెడ్డి మర్యాదపూర్వకంగా మంగళవారం ఆయన చాంబరులో కలిశారు. తనను ఎథిక్స్‌కమిటీ సభ్యునిగా నామినేట్‌ చేసిన సందర్భంగా ఉపరాష్ట్రపతిని కలిసి కృతజ్ఞతలు తెలిపారు.

అక్కడ అదృశ్యం..

ఇక్కడ ప్రత్యక్షం

కలకడ : కదిరాయచెర్వులో అదృశ్యమైన ద్విచక్రవాహనం పీలేరులో ప్రత్యక్షమైనట్లు వీఆర్‌ఓ పుల్లయ్య తెలిపారు. కలకడ మండలం కె.బాటవారిపల్లె సచివాలయంలో వీఆర్‌ఓగా విధులు నిర్వహిస్తున్న గుర్రంకొండ మండలం సరిమడుగుకు చెందిన పుల్లయ్య సోమవారం తన ద్విచక్రవాహనం హోండా ఆక్టివాను కదిరాయచెర్వు గ్రామంలో నిలిపి బస్సులో కలకడకు చేరుకున్నారు. సాయంత్రం విధులు ముగించుకుని తిరిగి కదిరాయచెర్వుకు చేరుకుని పరిశీలించగా తన ద్విచక్రవాహనం కనిపించలేదు. దీంతో అతను పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు మంగళవారం పీలేరులోని సంత ప్రదేశంలో ద్విచక్రవాహనాన్ని గుర్తించి బాధితుడికి అందజేశారు.

నీటి సంపులో పడి

బాలుడి మృతి

మదనపల్లె : ప్రమాదవశాత్తు నీటిసంపులో పడి బాలుడు మృతి చెందిన సంఘటన మంగళవారం రాత్రి మదనపల్లెలో జరిగింది. చంద్రాకాలనీకి చెందిన రాజశేఖర్‌రెడ్డి, గీత దంపతులకు సాత్విక్‌రెడ్డి, చార్విక్‌రెడ్డి(5) ఇద్దరు కుమారులు ఉన్నారు. మంగళవారం సాయంత్రం కాలనీలో నీటిసరఫరా జరుగుతున్న సమయంలో నీళ్లను పట్టుకునేందుకు తల్లి, నానమ్మ హడావిడిలో ఉండగా, ఇంటి ముందు ఆడుకుంటున్న చార్విక్‌రెడ్డి ప్రమాదవశాత్తు నీటి సంపులో పడ్డాడు. గమనించిన కుటుంబ సభ్యులు వెంటనే బాలుడిని బయటకు తీసి మదనపల్లె ప్రభుత్వ జిల్లా ఆస్పత్రికి తరలించారు. పరీక్షించిన అత్యవసర విభాగ వైద్యులు అప్పటికే బాలుడు మృతి చెందినట్లు నిర్ధారించారు. కుటుంబ సభ్యులు కన్నీటిపర్యంతమయ్యారు.

కారు బోల్తా

– ముగ్గురికి గాయాలు

గుర్రంకొండ : కారు బోల్తా పడి ముగ్గురు గాయపడిన సంఘటన మండలంలోని చెర్లోపల్లె పంచాయతీ సూరప్పగారిపల్లె వద్ద జరిగింది. మంగళవారం బెంగళూరుకు చెందిన నంజుండప్ప తమ కుటుంబంతో కలిసి కారులో రాయచోటికి బయలుదేరాడు. మార్గమధ్యంలో సూరప్పగారిపల్లెకు సమీపంలోని పెట్రోల్‌ బంకు వద్దకు చేరుకోగానే అడ్డంగా వచ్చిన ద్విచక్రవాహనాన్ని తప్పించబోయి అదుపు తప్పి కారు బోల్తా పడింది. ఈ సంఘటనలో నంజుండప్పతోపాటు ప్రకాష్‌, హేమావతిలకు రక్తగాయాలయ్యాయి. గాయపడిన వారిని 108 వాహనంలో వాల్మీకిపురం ప్రభుత్వాస్పత్రికి తరలించారు. మెరుగైన వైద్యం కోసం మదనపల్లె ప్రభుత్వాస్పత్రికి తీసుకెళ్లారు. ప్రమాదంపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

ఉప రాష్ట్రపతిని కలిసిన రాజ్యసభ సభ్యుడు మేడా  1
1/3

ఉప రాష్ట్రపతిని కలిసిన రాజ్యసభ సభ్యుడు మేడా

ఉప రాష్ట్రపతిని కలిసిన రాజ్యసభ సభ్యుడు మేడా  2
2/3

ఉప రాష్ట్రపతిని కలిసిన రాజ్యసభ సభ్యుడు మేడా

ఉప రాష్ట్రపతిని కలిసిన రాజ్యసభ సభ్యుడు మేడా  3
3/3

ఉప రాష్ట్రపతిని కలిసిన రాజ్యసభ సభ్యుడు మేడా

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement