మదనపల్లె : పట్టణంలోని నక్కలదిన్నెలో రోడ్డుకు అడ్డంగా కొందరు వ్యక్తులు నిర్మించిన గోడను మంగళవారం మున్సిపల్ సిబ్బంది తొలగించారు. నక్కలదిన్నె తండాలో ఓ వర్గానికి చెందిన వ్యక్తులు వీధిలో ఇతరులు రాకపోకలు సాగించకుండా అడ్డుగా గోడను నిర్మించారు. దీనిపై ఇంకో వర్గానికి చెందిన వ్యక్తులు మున్సిపల్ కార్యాలయం, జిల్లా కలెక్టర్కు ఫిర్యాదు చేశారు. దీంతో కలెక్టర్ శ్రీధర్ చామకూరి ఆదేశాల మేరకు, మున్సిపల్ కమిషనర్ కె.ప్రమీల ఆధ్వర్యంలో టీపీఓ జకీరాబేగం పర్యవేక్షణలో మున్సిపల్ సిబ్బంది పోలీస్ బందోబస్తు మధ్య గోడను తొలగించారు. తొలగింపు సందర్భంగా ఎలాంటి గొడవలు, ఘర్షణలు తలెత్తకుండా చర్యలు తీసుకున్నారు.