వైఎస్సార్‌సీపీ పాలన ముద్ర.. రాష్ట్రంపై చిరకాలం ఉండరాదని కూటమి కక్ష కట్టింది. ఇందుకోసం మాజీ సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి మానస పుత్రిక అయిన గ్రామ, వార్డు సచివాలయ వ్యవస్థను చిన్నాభిన్నం చేస్తోంది. వీటి ద్వారా జనానికి అందించే సేవల్లో కోత విధించింది. తాజాగా ర | - | Sakshi
Sakshi News home page

వైఎస్సార్‌సీపీ పాలన ముద్ర.. రాష్ట్రంపై చిరకాలం ఉండరాదని కూటమి కక్ష కట్టింది. ఇందుకోసం మాజీ సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి మానస పుత్రిక అయిన గ్రామ, వార్డు సచివాలయ వ్యవస్థను చిన్నాభిన్నం చేస్తోంది. వీటి ద్వారా జనానికి అందించే సేవల్లో కోత విధించింది. తాజాగా ర

Mar 19 2025 1:32 AM | Updated on Mar 19 2025 1:28 AM

బి.కొత్తకోట: మహాత్మా గాంధీజీ కలలుగన్న గ్రామ స్వరాజ్యం స్థాపన దిశగా గత సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి తీసుకొచ్చిన గ్రామ సచివాలయ వ్యవస్థపై.. కూటమి ప్రభుత్వం కక్ష కడుతోంది. ప్రజలకు మంచి చేయాలన్న సమున్నత ఆశయంతో అమలు చేసిన సచివాలయ వ్యవస్థను ఛిన్నాభిన్నం చేసేలా ఈ ప్రభుత్వం అడుగులు వేస్తోంది. దీనిపై ఆదేశాలు ఇవ్వడంతో క్షేత్రస్థాయిలో కార్యాచరణ మొదలైంది. ఫలితంగా ప్రజల ముంగిటకు పాలనను తీసుకొచ్చి.. వందల సంఖ్యలో ప్రభుత్వ సేవలు అందించిన సచివాలయాలను నిర్వీర్యం చేసే ప్రయత్నంగా కనిపిస్తోంది. వలంటీర్ల వ్యవస్థను అటకెక్కించిన ప్రభుత్వం.. వైఎస్సార్‌సీపీ సర్కారు ప్రజల కోసం తీసుకొచ్చిన కార్యక్రమాలను ఒక్కొక్కటిగా దూరం చేసే ప్రక్రియకు శ్రీకారం చుడుతోంది.

వైఎస్సార్‌సీపీ హయాంలో..

జిల్లాలో ప్రతి రెండు వేల మంది జనాభాకు ఒక సచివాలయం ఉండేలా.. గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో మారుమూల ప్రాంతాల ప్రజలకు ఎంతో ప్రయోజనం చేకూరింది. జిల్లాలోని ఆరు నియోజకవర్గాలు, 30 మండలాలు, మూడు మున్సిపాలిటీల పరిధిలో 502 గ్రామ, వార్డు సచివాలయాలను ఏర్పాటు చేసింది. ఈ వ్యవస్థ అందుబాటులోకి రావడంతో ప్రజలకు కలిగిన ప్రయోజనం అంతా ఇంతా కాదు. ప్రతి పనికి మండల కేంద్రానికి రావాల్సిన అవసరం తప్పింది. ఎక్కడికక్కడ సేవలు పొందే పరిస్థితి వచ్చింది. దీనివల్ల ప్రజలకు ప్రయాణ భారం, సమయం వృథా తప్పింది. అందులోనూ మండల కేంద్రంలోని కార్యాలయాలకు వెళ్తే అధికారులు అందుబాటులో లేకుంటే మళ్లీ వెళ్లాల్సి వచ్చేది. ఈ ఇబ్బందులను వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం దూరం చేసింది.

కొత్తగా క్లస్టర్లు

జిల్లా సచివాలయ వ్యవస్థను క్లస్టర్లుగా మార్చేందుకు చర్యలను అధికారులు చేపట్టారు. కూటమి ప్రభుత్వ ఆదేశాలతో ప్రతి రెండు సచివాలయాలను ఒక క్లస్టర్‌గా చేస్తున్నారు. వీటికి మ్యాపింగ్‌ కూడా చేస్తున్నారు. అంటే 502 సచివాలయాలను 251 క్లస్టర్లుగా మార్చుతారు. ప్రస్తుతం ఒక్కో సచివాలయంలో సాంకేతిక విభాగానికి చెందిన ఉద్యోగులు గ్రామ రెవెన్యూ అధికారి, ఏఎన్‌ఎం, సర్వే అసిస్టెంట్‌, ఇంజినీరింగ్‌ అసిస్టెంట్‌, వ్యవసాయ (అగ్రికల్చర్‌, హార్టికల్చర్‌, సెరికల్చర్‌), పశుసంవర్ధక (వెటర్నరీ, ఫిషరీష్‌), ఎనర్జీ అసిస్టెంట్‌ ఉద్యోగులు ఏడుగురు, సాధారణ పరిపాలనకు సంబంధించి పంచాయతీ కార్యదర్శి–గ్రేడ్‌ 1–5, డిజిటల్‌ అసిస్టెంట్‌, వెల్ఫేర్‌ ఎడ్యుకేషనల్‌ అసిస్టెంట్‌, గ్రామ మహిళ పోలీసు ఉద్యోగులు ఐదుగురు ఉంటారు. ఒక్కో సచివాలయానికి మొత్తం 11 మంది ఉద్యోగులు విధులు నిర్వహిస్తున్నారు.

వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంలోప్రజల ముంగిటకే సేవలు

జిల్లాలో 502 సచివాలయాల ఏర్పాటు

కొత్తగా రెండింటిని కలిపి ఒక క్లస్టర్‌గా మ్యాపింగ్‌

సాంకేతిక సిబ్బంది కుదింపు

1,757 మందిని తొలగించే అవకాశం

ఇప్పటికే 372 సేవల తొలగింపు

వైఎస్సార్‌సీపీ పాలన ముద్ర.. రాష్ట్రంపై చిరకాలం ఉండరాదని1
1/1

వైఎస్సార్‌సీపీ పాలన ముద్ర.. రాష్ట్రంపై చిరకాలం ఉండరాదని

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement