పుల్లంపేట మండలం గొల్లపల్లె రంగంపల్లె. నాపేరు బూసిరెడ్డి ఆదిలక్షుమ్మ. నాకొడుకు రెడ్డయ్యరెడ్డికి నాకు సంబంధించిన ఎకరాన్నర భూమిని రాయిచ్చాను. అయితే 172/3లో 26 సెంట్లు ఆన్లైన్లోకి ఎక్కలేదు. మ్యుటేషన్ చేయిస్తామనుకుంటే కంప్యూటర్ తీసుకోవడం లేదని సారోళ్లు చెబుతున్నారు. ఆరేడు నెలల నుంచి సచివాలయానికి, తహసీల్దార్ ఆఫీసు చుట్టూ తిరిగుతున్నా. నాపని మాత్రం కావడం లేదు. ఈ వయస్సులో ఎండలకు ఆఫీసుల చుట్టూ తిరగాలంటే అయ్యేపనేనా అయ్యా. ఏమైనా సమస్య ఉంటే ఇదోమ్మా ఈ సమస్య ఉంది అందువల్ల నీపని కాదు అని చెప్పొచ్చు కదా. ఎకరాన్నర భూమిలో 26 సెంట్లు మాత్రమే ఎందుకు ఆన్లైన్ చెయ్యరు.