చెరకు సాగు చేసిన రైతుల బతుకు చేదెక్కుతోంది. షుగర్ ఫ్యాక్టరీల మూసివేతతో దిగుబడిని విక్రయించుకోవడానికి వారు తీవ్ర అవస్థలు పడాల్సి వస్తోంది. మద్దతు ధర ప్రకటనలో ప్రభుత్వ ప్రోత్సాహం కరువు అవుతోంది. దీంతో చాలా మంది ప్రత్యామ్నాయ పంటలపై దృష్టి సారించారు. పర్యవసానంగా జిల్లాలో చెరకు సాగు గణనీయంగా తగ్గిపోయింది.
అమ్ముకునే వెసులుబాటు
కల్పించాలి
ఆరుగాలం కష్టపడి పండించిన చెరుకును అమ్ముకునేందుకు రైతులు అష్టకష్టాలు పడాల్సి వస్తోంది. చెరుకు విక్రయాలపై ఎకై ్సజ్ అధికారుల తీరు మారాలి. ప్రభుత్వం నల్లబెల్లం తయారీని అమ్ముకునే వెసులుబాటు కల్పించాలి. చెరకు పంటకు మార్కెట్ సౌకర్యం కల్పించి, గిట్టుబాటు ధర కల్పించాలి. అప్పుడే రైతులు చెరుకు సాగు చేయగలరు.
– రెడ్డిబాషా, రైతు, కొత్త కురవపల్లె,
తంబళ్లపల్లె మండలం
పలు సమస్యలతోనే అనాసక్తి
ఒకప్పుడు.. చెరుకు పంట దీర్ఘకాలికమైనా నికరమైన ఆదాయం వచ్చేది. ఇప్పుడు పలు సమస్యలు తలెత్తడంతో రైతులు చెరకు సాగుపై ఆసక్తి చూపడం లేదు. పక్క జిల్లాలో ఉన్న షుగర్ ఫ్యాక్టరీ మూతపడటం, మార్కెట్ సౌకర్యాలు లేకపోవడం, బెల్లం తయారీ సమయంలో కూలీల సమస్యతో రైతులు చెరుకు సాగును చేయలేకపోతున్నారు.
– రమణకుమార్,
వ్యవసాయ అధికారి, తంబళ్లపల్లె
ఎలుకలు ఉన్నాయని ఇంటినే తగలేసిన చందంగా తయారైంది.. ఎకై ్సజ్ అధికారుల తీరు. సారా తయారీకే బెల్లం వినియోగిస్తున్నారని భావిస్తే.. కచ్చితంగా అలాంటి వ్యాపారులపై చర్యలకు ఉపక్రమించాలి. కానీ పిండి వంటలు, ఇతర గృహ అవసరాలకు ఉపయోగపడే బెల్లాన్ని పూర్తిగా వద్దనడంపై విమర్శలు వస్తున్నాయి. మద్యపానం ఆరోగ్యానికి హానికరం అంటూ ప్రభుత్వం విస్తృతంగా ప్రచారం చేస్తోంది. అయినా గ్రామాల్లో అక్రమంగా మద్యం అమ్మకాలు విచ్చలవిడిగా కొనసాగుతూనే ఉన్నాయి. మరో వైపు ప్రభుత్వమే అధికారికంగా మద్యం అమ్మకాలు నిర్వహిస్తోంది. ఆరోగ్యానికి మేలు కలిగించే బెల్లం అమ్మకాలపై మాత్రం నిషేధం విధించింది. ఒకప్పుడు బెల్లం తయారీకి నియోజకవర్గం ప్రసిద్ధి. ఇక్కడ పండించే బెల్లం ముంబయి, చైన్నె, గుజరాత్ రాష్ట్రాలకు ఎగుమతి చేసేవారు. మార్చి, ఏప్రిల్, మే నెలల్లో అనంతపురం, వైఎస్సార్ జిల్లా, శ్రీ సత్యసాయి జిల్లాల నుంచి వ్యాపారులు పల్లెల్లో ముమ్మరంగా తిరిగి కొనుగోలు చేసి తీసుకెళ్లే వారు.
ఎకై ్సజ్ అధికారుల తీరుపై విమర్శలు
చేదెక్కిన చెరకు
చేదెక్కిన చెరకు
చేదెక్కిన చెరకు
చేదెక్కిన చెరకు