వీరబల్లి : మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో సోమవారం జరిగిన పదో తరగతి పబ్లిక్ పరీక్ష హాల్ టికెట్లో తప్పుగా ముద్రించడంతో పరీక్ష కేంద్రంలో అధికారులు హైరానా పడ్డారు. స్థానిక కస్తూర్బా గాంధీ బాలికల గురుకుల పాఠశాలలో పదోతరగతి చదువుతున్న నమృత హాల్ టికెట్లో తెలుగు పరీక్షకు బదులు హిందీ అని ముద్రించడంతో పరీక్ష కేంద్రంలో ఆ బాలికకు తెలుగు ప్రశ్నాపత్రం బదులు హిందీ ప్రశ్నా పత్రం ఇచ్చారు. ఇది గమనించిన విద్యార్థిని అవాకై ్కంది. వెంటనే ఆమె ఇన్విజిలేటర్ దృష్టికి తీసుకెళ్లగా అధికారులు వెంటనే డీఈఓకు విషయాన్ని తెలిపారు. ఆయన స్పందించి హిందీ ప్రశ్నాపత్రం ప్రక్కన పెట్టి తెలుగు ప్రశ్నాపత్రం ఇవ్వాలని ఆదేశించారు. దీంతో ఆ విద్యార్థిని తెలుగు పరీక్ష రాసింది.