రాయచోటి టౌన్ : ప్రకృతి వ్యవసాయ పద్ధతిలో పండించిన పంటలకు మంచి డిమాండ్ ఉందని మార్కెటింగ్ ఎన్ఎఫ్ పవన్ కుమార్ తెలిపారు. కలెక్టర్ కార్యాలయం ఆవరణంలో ప్రకృతి వ్యవసాయ పద్ధతిలో పండించిన పంటలను విక్రయించేందుకు ఒక స్టాల్ ఏర్పాటు చేశామన్నారు. ప్రతి సోమవారం ఈ స్టాల్ నిర్వహిస్తున్నట్లు తెలిపారు. గణనీయంగా కొనుగోళ్లు జరిగి రైతులు పండించిన పంటలకు డిమాండ్ పెరుగుతోందన్నారు. ఈ కార్యక్రమంలో మార్కెటింగ్ ఎంపీ పద్మావతి పాల్గొన్నారు.
ఎన్టీఆర్ వైద్య సేవ ఉద్యోగుల నిరసన
రాయచోటి టౌన్ : తమ సమస్యలను పరిష్కరించాలంటూ ఎన్టీఆర్ వైద్య సేవ ఉద్యోగులు సోమవారం జిల్లా కేంద్రంలోని వైద్య ఆరోగ్య శాఖ కార్యాలయం ఎదుట నిరసన తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వేతనాలు పెంచాలని, ఉద్యోగ భద్రత కల్పించాలని, క్యాడర్ కల్పించాలని కోరారు. అనంతరం తమ డిమాండ్లతో కూడిన వినతి పత్రాన్ని ఆ శాఖ అధికారులకు అందజేశారు.
ప్రకృతి పంటలకు మంచి డిమాండ్