కేవీపల్లె : మండలంలోని గర్నిమిట్టలో ఏపీ ఎమ్మార్పీఎస్ జెండా ఆవిష్కరణ స్థలాన్ని కబ్జా చేసిన టీడీపీ నాయకుడు గంగిరెడ్డిపై చర్యలు తీసుకోవాలని ఏపీ ఎమ్మార్పీఎస్ రాష్ట్ర అధికార ప్రతినిధి దొడ్డి సురేష్ మాదిగ డిమాండ్ చేశారు. ఈ మేరకు ఎమ్మార్పీఎస్ నాయకులు సోమవారం తహసీల్దార్ నరేంద్రకుమార్కు ఫిర్యాదు చేశారు. 20 ఏళ్లుగా తమ ఆధీనంలో ఉండి కార్యక్రమాలు జరుపుకుంటున్న స్థలాన్ని కబ్జా చేయడం సమంజసం కాదన్నారు. అధికారులు తక్షణం స్పందించి తమకు న్యాయం చేయాలని కోరారు. తహసీల్దార్ ఆదేశాలతో వెంటనే రెవెన్యూ సిబ్బంది సంబంధిత స్థలాన్ని పరిశీలించారు. సమస్య పరిష్కారం అయ్యేంత వరకు ఈ స్థలంలో ఎవరూ ప్రవేశించరాదని, ఎలాంటి నిర్మాణాలు చేపట్టరాదని తెలిపారు. ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి గడికోట గుణశేఖర్ తదితరులు పాల్గొన్నారు.