మల్లూరమ్మ హుండీ ఆదాయం రూ.2,93,890 | - | Sakshi
Sakshi News home page

మల్లూరమ్మ హుండీ ఆదాయం రూ.2,93,890

Mar 17 2025 3:03 AM | Updated on Mar 17 2025 11:24 AM

చిన్నమండెం : చిన్నమండెం మండలం మల్లూరు, కొత్తపల్లె గ్రామాల సరిహద్దు మాండవ్యనది ఒడ్డున ఉన్న మల్లూరమ్మ తల్లి ఆలయానికి భక్తులు పోటెత్తారు. ఆదివారం కావడం ఇటీవలే అమ్మవారి జాతర వైభవంగా జరగడంతో పెద్ద ఎత్తున భక్తులు అమ్మవారిని దర్శించుకున్నారు. భక్తులకు ఆలయ అర్చకులు తీర్థప్రసాదాలను అందజేశారు. అదే విధంగా మల్లూరమ్మ తల్లి ఆలయ హుండీలను లెక్కించగా రూ.2,93,890 ఆదాయం వచ్చినట్లు ఆలయ ఈఓ కొండారెడ్డి తెలిపారు.

రోడ్డు ప్రమాదాల్లో

ఇద్దరికి గాయాలు

మదనపల్లె సిటీ/బి.కొత్తకోట : రెండు వేర్వేరు రోడ్డు ప్రమాదాల్లో ఇద్దరు తీవ్రంగా గాయపడిన సంఘటనలు ఆదివారం జరిగాయి. బి.కొత్తకోట మండలం గొళ్లపల్లి పంచాయతీ కనికలతోపుకు చెందిన షేక్‌ మౌలాలి(35) పేపర్‌బాయ్‌గా పని చేస్తున్నాడు. ఉదయం పేపర్‌ ద్విచక్రవాహనంలో వేస్తుండగా ఎదురుగా వచ్చి కారు ఢీకొనడంతో గాయపడ్డాడు. స్థానికులు గమనించి మదనపల్లె జిల్లా ఆస్పత్రికి తరలించారు. గుర్రంకొండ మండలం చెరువుముందరపల్లెకు చెందిన నారాయణ (45) ద్విచక్రవాహనంలో కలకడ క్రాస్‌ వద్ద వెళుతుండగా ఎదురుగా వస్తున్న కారు ఢీకొనడంతో తీవ్రంగా గాయపడ్డాడు. గమనించిన స్థానికులు మదనపల్లె జిల్లా ఆస్పత్రికి తరలించారు. సంబంధిత పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.

ఏప్రిల్‌ 2 నుంచి సీపీఎం జాతీయ మహాసభలు

కడప వైఎస్‌ఆర్‌ సర్కిల్‌ : సీపీఎం జాతీయ మహాసభలు ఏప్రిల్‌ 2 నుంచి తమిళనాడులోని మధురైలో నిర్వహించనున్నట్లు సీపీఎం కేంద్ర కమిటీ సభ్యుడు ఎంఏ గఫూర్‌ తెలిపారు. ఆదివారం ఆర్‌కే నగర్‌లోని సీపీఎం కార్యాలయంలో పార్టీ జిల్లా విస్తృత స్థాయి సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భవిష్యత్తులో దేశంలో, రాష్ట్రంలో జరిగే ఎలాంటి ఎన్నికల్లోనా సీపీఎం పొత్తులు ఒకే రకంగా ఉండవని తెలిపారు. స్థానిక పరిస్థితులను బట్టి ఉంటాయన్నారు. ఏప్రిల్‌ 2 నుంచి 6వ తేదీ వరకు తమిళనాడు రాష్ట్రంలోని మధురైలో జరిగే 24వ సీపీఎం జాతీయ మహాసభల్లో స్పష్టమైన రాజకీయ విధానం రూపొందించనున్నట్లు తెలిపారు. నేడు దేశంలో బీజేపీ, ఆర్‌ఎస్‌ఎస్‌ మత ద్వేషాన్ని ప్రచారం చేస్తున్నాయని చెప్పారు. దీనికి వ్యతిరేకంగా లౌకిక ప్రజాస్వామ్య శక్తులను ఐక్యం చేయడం సీపీఎం భవిష్యత్తు కార్యాచరణ అన్నారు. ఈ కార్యక్రమంలో సీపీఎం జిల్లా కార్యదర్శి జి.చంద్రశేఖర్‌, జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు ఏ.రామ్మోహన్‌, బి.మనోహర్‌, వి.అన్వేష్‌, జిల్లా కమిటీ సభ్యులు కె.శ్రీనివాస్‌ రెడ్డి, బి.దస్తగిరి రెడ్డి, పి.చాంద్‌ బాషా, కె.సత్యనారాయణ, గౌసియా బేగం తదితరులు పాల్గొన్నారు.

మల్లూరమ్మ హుండీ ఆదాయం రూ.2,93,890  1
1/2

మల్లూరమ్మ హుండీ ఆదాయం రూ.2,93,890

మల్లూరమ్మ హుండీ ఆదాయం రూ.2,93,890  2
2/2

మల్లూరమ్మ హుండీ ఆదాయం రూ.2,93,890

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement