జిల్లా అభివృద్ధికి ప్రణాళికలను సిద్ధం చేయండి | - | Sakshi
Sakshi News home page

జిల్లా అభివృద్ధికి ప్రణాళికలను సిద్ధం చేయండి

Mar 16 2025 2:06 AM | Updated on Mar 16 2025 2:01 AM

రాయచోటి: జిల్లా ఆర్థికాభివృద్ధికి అన్ని ప్రభుత్వ శాఖలు ప్రణాళికలను రూపొందించాలని జిల్లా కలెక్టర్‌ చామకూరి శ్రీధర్‌ జిల్లా అధికారులను ఆదేశించారు. శనివారం సాయంత్రం రాయచోటి కలెక్టరేట్‌లోని మినీ వీడియో కాన్ఫరెన్స్‌ హాల్‌లో జరగిన సమావేశంలో కలెక్టర్‌ మాట్లాడుతూ స్వర్ణాంధ్ర 2047 విజన్‌లో భాగంగా రానున్న ఐదు సంవత్సరాలకు, 2047 నాటికి జిల్లా అభివృద్ధికి చేపట్టాల్సిన కార్యాచరణ ప్రణాళలు డాక్యుమెంటరీ సిద్ధం చేసి సమర్పించాలని సూచించారు. జిల్లాను అన్ని రంగాల్లో అభివృద్ది చేసే విధంగా ఆయా శాఖలు ప్రణాళికలు రూపొందించుకొని లక్ష్య సాధన కోసం కృషి చేయాలని జిల్లా కలెక్టర్‌ తెలిపారు. సమావేశంలో జాయింట్‌ కలెక్టర్‌ ఆదర్శ రాజేంద్రన్‌ తదితరులు పాల్గొన్నారు.

జిల్లా కలెక్టర్‌ చామకూరి శ్రీధర్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement