ప్లాస్టిక్‌రహిత జిల్లాగా తీర్చిదిద్దేందుకు కృషిచేయాలి | - | Sakshi
Sakshi News home page

ప్లాస్టిక్‌రహిత జిల్లాగా తీర్చిదిద్దేందుకు కృషిచేయాలి

Mar 16 2025 2:06 AM | Updated on Mar 16 2025 2:01 AM

రాయచోటి అర్బన్‌: స్వర్ణాంధ్ర– స్వచ్ఛాంద్ర కార్యక్రమంలో భాగంగా అన్నమయ్య జిల్లాను ప్లాస్టిక్‌రహితంగా తీర్చిదిద్దేందుకు ప్రతి ఒక్కరూ కృషిచేయాలని రాష్ట్ర రవాణా, క్రీడల శాఖమంత్రి మండిపల్లె రాంప్రసాద్‌రెడ్డి పిలుపునిచ్చారు. శనివారం పట్టణంలోని వీరభద్రాలయం ఎదురుగా ఉన్న కూరగాయల మార్కెట్‌లో నిర్వహించిన స్వర్ణాంధ్ర –స్వచ్ఛాంద్ర కార్యక్రమంలో జిల్లా కలెక్టర్‌ చామకూరి శ్రీధర్‌, జిల్లా ప్రత్యేకాధికారి వాడరేవు వినయ్‌చంద్‌, జేసీ ఆదర్స్‌ రాజేంద్రన్‌లతో కలసి మంత్రి పాల్గొన్నారు. ఈ సందర్బంగా మంత్రి మాట్లాడుతూ ప్రతినెలా 3వ శనివారం జరిగే ఈ కార్యక్రమంలో అధికారులు, ప్రజాప్రతినిధులు, ప్రతి ఒక్కరూ పాల్గొని రాయచోటి పట్టణాన్ని పరిశుభ్రంగా ఉంచేలా చర్యలు చేపట్టాలని కోరారు.

● జిల్లా కలెక్టర్‌ శ్రీధర్‌ చామకూరి మాట్లాడుతూ స్వర్ణాంధ్ర– స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని తెలిపారు. కాలుష్య కారకమైన ప్లాస్టిక్‌ వినియోగాన్ని పూర్తిగా నివారించి ప్లాస్టిక్‌ రహిత జిల్లాగా గుర్తింపు తీసుకురావాలని కోరారు. కార్యక్రమంలో మున్సిపల్‌ కమిషనర్‌ వాసుబాబు, పలుశాఖల అధికారులు, ఉద్యోగులు పాల్గొన్నారు.

స్వచ్ఛాంద్ర కార్యక్రమంలో

అందరూ భాగస్వాములు కావాలి

రాయచోటి: రాయచోటిలో నిర్వహించిన స్వచ్ఛాంధ్ర–స్వర్ణాంధ్ర కార్యక్రమంలో జిల్లా ప్రత్యేక అధికారి వాడరేవు వినయ్‌చంద్‌ పాల్గొన్నారు. శనివారం ఉదయం జిల్లా కలెక్టర్‌ శ్రీధర్‌తో కలిసి పాల్గొని ప్రతిజ్ఞ చేశారు. అనంతరం వీరభద్రస్వామి వారిని దర్శించుకున్నారు. అర్చకులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. అనంతరం ఆలయ మండపంలో తీర్థప్రసాదాలు అందించి వేదాశీర్వచనం చేశారు. ప్రభుత్వం నిర్వహిస్తున్న సచ్ఛాంధ్ర,స్వర్ణాంధ్ర కార్యక్రమంలో భాగంగా డైట్‌ ఉన్నత పాఠశాలను సందర్శించారు. విద్యార్థి దశ నుంచే విద్యార్థులు పరిశుభ్రతను అల వాటు చేసుకోవాలన్నారు. అనంతరం ఆర్టీసీ బస్సు కూడలి వద్ద ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పాల్గొన్నారు. పారిశుద్ధ్య నిర్వహణ బాధ్యత మున్సిపల్‌, పంచాయతీ కార్మికులది మాత్రమే కాదని, ఇది ప్రతి ఒక్కరి బాధ్యత అని స్వచ్ఛాంధ్ర ప్రతిజ్ఞ ప్రజలందరితో చేయించారు. కార్యక్రమంలో జాయింట్‌ కలెక్టర్‌ ఆదర్శ రాజేంద్రన్‌, మున్సిపల్‌ కమిషనర్‌ వాసు, ఆలయ ఈఓ విశ్వనాథ్‌ తదితరలు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement