మదనపల్లె : నరేంద్ర మోదీ మూడవసారి ప్రధానమంత్రి అయినా, 11 ఏళ్ల పాటు దేశాన్ని పాలించినా, ప్రజలకు ఒరిగిందేమీ లేదని, ఆయన మాత్రం పదివేల జతల బట్టలు మార్చాడే తప్ప దేశాభివృద్ధికి చేసింది శూన్యమని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు, మాజీ కేంద్రమంత్రి చింతామోహన్ విమర్శించారు. శనివారం స్థానిక ప్రెస్క్లబ్లో పట్టణ కాంగ్రెస్ సీనియర్ నాయకుడు రెడ్డి సాహెబ్తో కలిసి విలేకరుల సమావేశంలో మాట్లాడారు. కేంద్రంలోని పెద్దలు కుల,మత ప్రాంతీయ భేదాలు సృష్టి్ంచి విష బీజాలు నాటుతూ పబ్బం గడుపుకుంటున్నారన్నారు. ప్రజలు జాగ్రత్త పడకపోతే ముప్పు తప్పదన్నారు. ఎస్సీ వర్గీకరణకు తాను వ్యతిరేకమని, రాజకీయ ప్రయోజనాల కోసం రెండు వర్గాల మధ్య పెద్దలు పెడుతున్న చిచ్చుగా అభివర్ణించారు. వర్గీకరణకు ఏకసభ్య కమిషన్ను ఏర్పాటు చేయడం తగదన్నారు. మదనపల్లెలోని శానిటోరియం టీబీ ఆసుపత్రి నేడు అధ్వాన స్థితికి చేరుకోవడం చాలా బాధాకరమన్నారు. అదేవిధంగా మదనపల్లి బీటీ కాలేజ్ కూడా నేడు ఇదే స్థితికి చేరడానికి నాయకుల నిర్లక్ష్యమే కారణమన్నారు. శానిటోరియం టీబి ఆసుపత్రి, బీటీ కాలేజ్ లను పునరుద్ధరించాలన్నారు.
మాజీ కేంద్రమంత్రి, కాంగ్రెస్ సీనియర్
నాయకుడు చింతామోహన్