కేసులతో వేధించడం సరికాదు | - | Sakshi
Sakshi News home page

కేసులతో వేధించడం సరికాదు

Mar 16 2025 2:03 AM | Updated on Mar 16 2025 2:00 AM

కడప అర్బన్‌ : ఎక్కడైనా రెండు వర్గాల మధ్య సమస్యలు ఉన్నప్పుడు శాంతియుతంగా ఆ సమస్యను పరిష్కరించాల్సిందిపోయి ఒకే వర్గాన్ని లక్ష్యంగా చేసుకుని విపరీతమైన సెక్షన్‌లతో కేసులు పెట్టి వేధించడం అనేది చాలా దారుణమని భారత చైతన్య యువజన పార్టీ అధ్యక్షుడు రామచంద్ర యాదవ్‌ అన్నారు. ఇటీవల రాయచోటిలో జరిగిన సంఘటనకు సంబంధించి అక్రమ కేసుల ద్వారా రిమాండ్‌లో ఉన్న బాధితులను శనివారం ఆయన కడప కేంద్ర కారాగారానికి వచ్చి పరామర్శించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. రాష్ట్ర ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి, బీజేపీ నేతలు ఇలాంటి ఘటనలపై స్పదించాలని, భవిష్యత్తులో ఇలాంటి సంఘటనలు జరగకుండా జాగ్రత్తపడాలన్నారు.

సారా రహిత జిల్లాగా చేద్దాం

కలకడ : అన్నమయ్య జిల్లాను సారా రహిత జిల్లాగా చేద్దామని, సారాతో వ్యక్తి, కుటుంబం, గ్రామం అభివృద్ధికి దూరమవుతారని జిల్లా ఎకై ్సజ్‌ సూపరింటెండెంట్‌ జోగేంద్ర అన్నారు. శనివారం మండలంలోని దిగువతాండాలో సర్పంచ్‌ స్వరూప అధ్యక్షతన అవగాహన సదస్సు నిర్వహించారు. సారా రహిత గ్రామాలతో విద్యార్థులకు ఉపాధి అవకాశాలు, ఉన్నత విద్య సాధ్యమన్నారు. ఈ కార్యక్రమంలో పీలేరు ఎకై ్సజ్‌ ఎస్‌ఐ సీహెచ్‌వీ సుబ్బారెడ్డి, జహీర్‌ అహమ్మద్‌ తదితరులు పాల్గొన్నారు.

వేర్వేరు ప్రమాదాల్లో

ముగ్గురికి తీవ్ర గాయాలు

మదనపల్లె : వేర్వేరు ప్రమాదాల్లో శనివారం ముగ్గురు వ్యక్తులు తీవ్రంగా గాయపడ్డారు. కురబలకోట మండలం మట్లివారిపల్లె పంచాయతీ గుడ్లవారిపల్లెకు చెందిన ఆదినారాయణ (55), నాగమల్లిరెడ్డి (54) ద్విచక్రవాహనంలో సీటీఎం నుంచి పెద్దపల్లెకు వస్తుండగా మార్గమధ్యంలోని బాటమారెమ్మ క్రాస్‌ వద్ద ఎదురుగా వచ్చిన ఆటో ఢీకొంది. ప్రమాదంలో ఇద్దరు తీవ్రంగా గాయపడగా, గమనించిన స్థానికులు మదనపల్లె జిల్లా ఆస్పత్రికి తరలించారు. అదే విధంగా మండలంలోని తట్టివారిపల్లె పంచాయతీ తిరుపతిరోడ్డులోని ఎర్రగానిమిట్టకు చెందిన మధుకర్‌రెడ్డి (40) వ్యక్తిగత పనులపై పట్టణంలోకి వచ్చి ద్విచక్రవాహనంలో తిరిగి ఇంటికి వెళుతుండగా మార్గమధ్యంలోని ఎస్టేట్‌ వద్ద ఎదురుగా వచ్చిన మరో ద్విచక్రవాహనం ఢీకొని తీవ్రంగా గాయపడ్డారు. గమనించిన స్థానికులు జిల్లా ఆస్పత్రికి తరలించారు. సంబంధిత పోలీసులు కేసులు విచారణ చేస్తున్నారు.

ఎర్రగుంట్లలో చోరీ

ఎర్రగుంట్ల : ఎర్రగుంట్ల నగర పంచాయతీ పరిధిలోని వినాయకనగర్‌ కాలనీలో అబ్దుల్‌ సత్తార్‌ ఇంటిలో చోరీ జరిగింది. విషయం తెలుసుకున్న పట్టణ సీఐ నరేష్‌కుమార్‌ శనివారం ఉదయం సంఘటన స్థలాన్ని పరిశీలించారు. క్లూస్‌టీం వచ్చి సంఘటన స్థలంలో వేలి ముద్రలు సేకరించారు. బాధితుతు తెలిపిన వివరాలకు మేరకు ...అబ్దుల్‌ సత్తార్‌ రెండు రోజుల క్రితం తన కూతురు వద్దకు వెళ్లి తిరిగి ఇంటికి వచ్చి చూడగా తాళాలు పగలగొట్టి ఉన్నాయి. లోనికి వెళ్లి చూడగా బీరువాలో ఉన్న రెండు జతల కమ్మలు, వెండి పట్టీలు, గజ్జెలు చోరీకి గురైనట్లు గుర్తించాడు.

వాహనాలు సీజ్‌

కడప కోటిరెడ్డిసర్కిల్‌ : కడప నగర శివారులోని చిన్నచౌక్‌ గ్రామ సర్వే నెంబర్‌ 919లో అక్రమంగా గ్రావెల్‌ తరలిస్తున్న వాహనాలను రెవెన్యూ అధికారులు పట్టుకున్నారు. రెండు టిప్పర్లు, ఒక ట్రాక్టర్‌ నిబంధనలకు విరుద్ధంగా గ్రావెల్‌ తరలిస్తుండగా సీజ్‌ చేశారు. పట్టుబడిన వాహనాలను కడప నగరంలోని తహసీల్దార్‌ కార్యాలయానికి తరలించారు.

కేసులతో వేధించడం సరికాదు   1
1/2

కేసులతో వేధించడం సరికాదు

కేసులతో వేధించడం సరికాదు   2
2/2

కేసులతో వేధించడం సరికాదు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement