నియమావళితోనే సజావుగా పరీక్ష | - | Sakshi
Sakshi News home page

నియమావళితోనే సజావుగా పరీక్ష

Mar 16 2025 2:03 AM | Updated on Mar 16 2025 2:00 AM

మదనపల్లె సిటీ /రాజంపేట టౌన్‌ : జిల్లాలో పదో తరగతి విద్యార్థులకు ఈనెల 17వతేదీ నుంచి పరీక్షలు జరగనున్నాయి. నియమ, నింబంధనలు పాటిస్తే పరీక్షలు సజావుగా రాయవచ్చు. ఈ నేపథ్యంలో విద్యార్థులు, తల్లిదండ్రులకు ప్రత్యేక సూచనలు..

● విద్యార్థులకు కేటాయించిన పరీక్ష కేంద్రం ఎక్కడ ఉన్నదన్న విషయాన్ని ఒక రోజు ముందుగా తెలుసుకుని ఆ కేంద్రాన్ని పరిశీలించి రావాలి.

● పరీక్ష రోజు ఉదయం 8.30 గంటలకు కేంద్రానికి చే రుకోవాలి. పరీక్షలు రాయడానికి ప్యాడ్లు తీసుకెళ్లాలి.

● పరీక్షకు అవసరమైన మేరకు పెన్నులు, పెన్సిళ్లు, రబ్బర్‌, స్కేలు తీసుకెళ్లాలి. పరీక్షా కేంద్రంలో ఇతర విద్యార్థులను అడిగి వారిని ఇబ్బంది పెట్టకూడదు.

● పరీక్ష కేంద్రంలో విద్యార్థులకు కేటాయించిన స్థానంలో 9 గంటలకే కూర్చోవాలి.

● ఇన్విజిలేటర్‌ ఇచ్చిన మెయిన్‌ జావాబుపత్రం, ఓఎంఆర్‌ పత్రం తమదేనా? కాదా అన్న విషయాన్ని ధ్రువీకరించుకుని పరీక్ష రాయాలి.

● అడిషనల్‌ జవాబు పత్రాన్ని దారంతో గట్టిగా కట్టి ఇవ్వాలి.

● మెయిన్‌ జవాబు పత్రంపై ఉన్న నంబర్‌ను, అడిషనల్‌ జవాబుపత్రం, గ్రాఫ్‌, మ్యాప్‌, బిట్‌ పేపర్లపై తప్పనిసరిగా రాయాలి.

విద్యార్థులు వీటి జోలికి వెళ్లకూడదు..

● పరీక్షా కేంద్రానికి సెల్‌ఫోన్‌, క్యాలికులేటర్‌, ఇతర ఎలక్ట్రానిక్‌ పరికరాలు తీసుకు వెళ్లకూడదు.

● హాల్‌టిక్కెట్‌ తప్ప ఏ విధమైన కాగితాలు వెంట తీసుకువెళ్లకూడదు.

● ఎట్టి పరిస్థితుల్లోనూ జవాబు పత్రాలను పరీక్ష కేంద్రం నుంచి బయటకు తీసుకెళ్లరాదు.

● హాల్‌టిక్కెట్‌ నంబర్‌ను జవాబుపత్రం, అడిషనల్‌, బిట్‌, మ్యాప్‌, గ్రాఫ్‌ల్లో ఎక్కడా కూడా రాయకూడదు.

● విద్యార్థి పేరుగాని, సంతకం తదితర ఏ విధమైన గుర్తింపు చిహ్నాలు, నినాదాలు జవాబు పత్రాలపై రాయరాదు.

తల్లిదండ్రులు ఇవి పాటించాలి..

● తమ పిల్లలకు కేటాయించిన పరీక్ష కేంద్రాన్ని ముందు రోజు చూపించాల్సిన బాధ్యత తల్లిదండ్రులదే.

● రోజూ పరీక్ష కేంద్రాలకు 8.30 గంటలలోపు చేరుకునేలా చూడాల్సిన బాధ్యత కూడా తల్లిదండ్రులదే. మాల్‌ప్రాక్టీస్‌ వద్దని సూచించాలి.

● పుకార్లను నమ్మి విద్యార్థులను భయపెట్టకూడదు.

విద్యార్థులు, తల్లిదండ్రులకు సూచనలు

తల్లిదండ్రుల పాత్ర కీలకం

పరీక్షకు ముందు రోజు రాత్రి పొద్దుపోయే వరకు చదవమని పిల్లలపై తల్లిదండ్రులు ఒత్తిడి చేయకూడదు. పరీక్షా కేంద్రానికి వెళ్లే ముందు హాల్‌టికెట్‌, పెన్నులు, పెన్సిల్‌, స్కేల్‌, రబ్బరు వంటివి ఉన్నాయా లేవా అని తల్లిదండ్రులు ఒకసారి విధిగా పరిశీలించాలి. పరీక్షలు ముగిసే వరకు ఆందోళన కలిగించే విషయాలు పిల్లలకు తెలియకుండా చూసుకోవాలి. పరీక్షల సమయంలో పిల్లలపై ఎట్టి పరిస్థితుల్లో తల్లిదండ్రులు కోప్పడకూడదు. ఏదైనా తప్పు చేస్తే అది తప్పని సున్నితంగా చెప్పే ప్రయత్నం చేయాలి. పిల్లలకు నిజమైన కౌన్సిలర్లు తల్లిదండ్రులే. ఈ విషయాలన్నింటిని తల్లిదండ్రులు గుర్తుంచుకోవాలి.

– కాశిగారి ప్రసాద్‌, అసోసియేట్‌ ప్రొఫెసర్‌, అన్నమాచార్య యూనివర్సిటీ, రాజంపేట

నియమావళితోనే సజావుగా పరీక్ష 1
1/1

నియమావళితోనే సజావుగా పరీక్ష

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement