కేవీపల్లె : అగ్నిప్రమాదంలో మామిడిచెట్లు దగ్ధమైన సంఘటన మండలంలోని వగళ్ల పంచాయతీ నారమాకులమిట్టలో జరిగింది. వివరాలిలా ఉన్నాయి. పీలేరు సర్పంచ్ డాక్టర్ హబీబ్బాషాకు చెందిన మామిడితోట పక్కన ఉన్న కొండకు గుర్తు తెలియని వ్యక్తులు నిప్పంటించారు. మంటలు పక్కనే ఉన్న మామిడి తోటకు వ్యాపించాయి. స్థానికులు సమాచారం ఇవ్వడంతో హబీబ్బాషా పీలేరు అగ్నిమాపక కేంద్రానికి సమాచారం ఇచ్చారు. దీంతో అగ్నిమాపక సిబ్బంది సంఘటన స్థలానికి చేరుకుని మంటలు అదుపుచేశారు. అయితే అప్పటికే 40 మామిడి చెట్లు, 20 కొబ్బరిచెట్లు, రెండు మోటార్లు, డ్రిప్ పైపులు కాలిపోయాయి. ఈ ప్రమాదంలో సుమారు రూ. 5 లక్షలు నష్టం వాటిల్లినట్లు బాధితులు తెలిపారు.
ట్రాక్టర్ ఢీ కొని వ్యక్తి మృతి
చిట్వేలి : చిట్వేలి గుంజన నది సమీపంలోని పెట్రోల్ బంకు వద్ద శనివారం మధ్యాహ్నం జరిగిన రోడ్డు ప్రమాదంలో తిమ్మయ్యగారిపల్లి దళితవాడకు చెందిన వళ్లెం పాపయ్య (40) మృతి చెందినట్లు ఎస్ఐ రఘురాం తెలిపారు. వివరాల మేరకు పెనగలూరు మండలం, రాచవారిపల్లికి చెందిన నువ్వుల సురేష్ (30) రాజంపేట వైపు నుంచి ట్రాక్టర్ (ఏపీ04బికె2431)లో ఇసుక తీసుకొని చిట్వేలి వైపు వస్తున్నాడు. ఇదే సమయంలో స్థానిక జెడ్పీ ఉన్నత పాఠశాలలో జరిగిన పదోతరగతి విద్యార్థుల వీడ్కోలు సమావేశంలో పాల్గొన్న పాపయ్య రాజంపేట వైపు ద్విచక్ర వాహనంలో వెళుతుండగా ట్రాక్టర్ ఢీ కొంది. తీవ్రంగా గాయపడిన అతన్ని చికిత్స నిమిత్తం రాజంపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా అక్కడ చికిత్స పొందుతూ మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు. ఈ మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ రఘురాం తెలిపారు.
మిద్దైపె నుంచి కిందపడి..
రామాపురం : మండలంలోని కసిరెడ్డిగారిపల్లె పంచాయితీ కొత్తరోడ్డునారాయణపురం వినాయక స్టోన్ క్రషర్లో పని చేస్తున్న ఉత్తరప్రదేశ్ వారణాసికి చెందిన రాజేష్యాదవ్(40) మద్యం మత్తులో మిద్దైపె నుంచి కిందపడి మృతి చెందాడు. ఎస్ఐ వెంకటసుధాకర్రెడ్డి కథనం మేరకు వివరాలు.. రాజేష్ యాదవ్ కొత్తరోడ్డు నారాయణపురంలో ఇంటిని అద్దెకు తీసుకొని నివాసం ఉంటూ సమీపంలోని వినాయక స్టోన్ క్రషర్లో పని చేస్తుండేవాడు. శుక్రవారం హోలీ పండుగ సందర్భంగా రాత్రి తోటి సిబ్బందితో కలిసి అతిగా మద్యం సేవించి అర్థరాత్రి సమయంలో మద్యం మత్తులో మిద్దైపె నుంచి కిందిపడి మృతి చెందాడు. మృతుడి బంధువులు వచ్చిన వెంటనే వివరాలు సేకరించి కేసు నమోదు చేస్తామన్నారు.
కొనసాగుతున్న పెట్రోలు, డీజిల్ నిక్షేపాల సర్వే
లింగాల : లింగాల మండలంలో డీజిల్, పెట్రోలు నిక్షేపాలను గుర్తించేందుకు అన్వేషణ కొనసాగుతోంది. రైతులకు తెలియకుండా వారి పొలాల్లో బోర్లు వేయబోమని కాంట్రాక్టర్లు మాధవరెడ్డి, సురేష్ తెలిపారు. హైదరాబాద్కు చెందిన అక్షయ ఇన్ఫ్రాస్ట్రక్చర్ సంస్థకు లేబర్ కాంట్రాక్టు పొంది ఈ అన్వేషణలో భాగంగా లింగాల, తొండూరు మండలాల్లో బోరుబావుల తవ్వకం నిర్వహిస్తున్నామన్నారు. అయితే ఆ గ్రామాల వీఆర్ఓలకు, సర్పంచ్లకు తెలియజేసి దండోరా వేయించి రైతులకు తెలియపరుస్తామన్నారు.
అగ్నిప్రమాదంలో మామిడిచెట్లు దగ్ధం
అగ్నిప్రమాదంలో మామిడిచెట్లు దగ్ధం
అగ్నిప్రమాదంలో మామిడిచెట్లు దగ్ధం