రాయచోటి అర్బన్ : బాలభటులు నాయకత్వ లక్షణాలను పెంపొందించుకుని ప్రపంచ స్థాయి పౌరులుగా ఎదగాలని స్కౌట్ అండ్ గైడ్స్ జిల్లా కార్యదర్శి మడితాటి నరసింహారెడ్డి కోరారు. రాయచోటి పట్టణంలోని అర్చన కళాశాలలో ఈ నెల 10వ తేదీ నుంచి నిర్వహిస్తున్న పెట్రోల్ లీడర్స్ శిక్షణ ముగింపు సమావేశం శుక్రవారం జరిగింది. ఆయన మాట్లాడుతూ జిల్లాలో ఎంపికై న 36 పీఎంశ్రీ పాఠశాలల నుంచి వచ్చిన 272 మంది విద్యార్థులకు శిక్షణ ఇచ్చారన్నారు. ప్రకృతి వైపరీత్యాలు సంభవించినప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలనే అంశాలను విరవించారన్నారు. రోడ్డుప్రమాదాలు జరిగి నప్పుడు ప్రథమ చికిత్స అందించి సమీపంలోని ఆసుపత్రికి చేర్చడం, స్వచ్ఛందంగా సేవలందించడం, మంచి అలవాట్లను నేర్పించడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో ఏఎస్ఓ లక్ష్మికర్, హెచ్డబ్ల్యూఓ నిర్మల, ఓబులరెడ్డి, నాగరాజు, సుజాత, గోవిందమ్మ, స్వర్ణలత పాల్గొన్నారు.