జమ్మలమడుగు రూరల్ : పట్టణంలోని నాగులకట్ట వీధిలోని ఎస్సీ హస్టల్లో ఉంటున్న అక్షయ(19) శుక్రవారం విష ద్రావణం తాగి ఆత్మహత్యకు పాల్పడింది. వివరాలిలా ఉన్నాయి. పెద్దముడియం మండలం కొండసుంకేసుల గ్రామానికి చెందిన అక్షయ పట్టణంలోని ప్రైవేట్ కళాశాలలో డిగ్రీ మొదటి సంవత్సరం చదువుతూ ఎస్సీ హాస్టల్లో ఉంటోంది. గురువారం రాత్రి వసతి గృహంలో వి ద్యార్థినుల మధ్య మనస్పర్థలు చోటుచేసుకోవడం, కాసేపటి తరువాత విద్యార్థి నులు క్షమాపణలు చెప్పుకోవడం జరిగినట్లు తెలిసింది. అయితే శుక్రవారం మ ధ్యాహ్నం అందరూ భోజనం చేయడానికి వెళ్లగా అక్షయ మాత్రం వెళ్లలేదు. అప్ప టికే తెచ్చుకున్న విష ద్రావణాన్ని(వాస్మోల్) తాగింది. విషయం తెలుసుకున్న వార్డెన్ బత్తుల ప్రభావతి స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. వైద్యుల సూ చన మేరకు పట్టణంలోని ప్రైవేట్ ఆసుపత్రికి తీసుకెళ్లారు. అక్కడ చికిత్స పొందుతూ రాత్రి 8.45 గంటల మధ్యలో చనిపోయినట్లు డాక్టర్లు ధ్రువీకరించారు.
ప్రజా సంఘాల ఆగ్రహం
అక్షయ అత్మహత్యపై ప్రజాసంఘాల నాయకులు అగ్రహం వ్యక్తం చేశారు. సీపీఐ, ఏఐఎస్ఎఫ్ నాయకులు వసతిగృహనికి చేరుకోని విద్యార్థిని మృతికి హస్టల్ వార్డన్ బత్తుల ప్రభావతి, సిబ్బంది కారణం అని హస్టల్స్ ఏఎస్డబ్ల్యూ గురుప్రసాద్, సీఐ లింగప్పకు ఫిర్యాదు చేశారు. గత ఏడాది నవంబరు 7న కూడా వసతి గృహంలో ఇద్దరు విద్యార్థినులు వాస్మాల్ తాగి అత్మహత్య యత్నానికి పాల్పడ్డారని వారు ఆరోపించారు. ఇంత జరుగతున్నా అధికారులు చర్యలు చేపట్టలేదన్నారు. సీఐ ఎస్.లింగప్ప వసతి గృహానికి వెళ్లి విద్యార్థినులను విచారించారు. దర్యాప్తు అనంతరం అక్షయ ఆత్మహత్యయత్నానికి కారణాలు తెలియజేస్తామని సీఐ తెలిపారు.