సంబేపల్లె : మండలంలోని నారాయణరెడ్డిపల్లె పంచాయతీ కొండావాండ్లపల్లెకు చెందిన చంద్రగిరి లక్ష్మీదేవి(36) కువైట్లో మృతిచెందినట్లు బంధువులు తెలిపారు. ఏడాది కిందట బతుకుదెరువుకోసం లక్ష్మీదేవి కువైట్కు వెళ్లారు. భర్త శ్రీనివాసులు ఆటో డ్రైవర్గా పని చేస్తూ జీవనం సాగిస్తున్నారు. ఈ క్రమంలోనే శుక్రవారం తెల్లవారుజామున కువైట్ లక్ష్మీదేవి చనిపోయిందని మృతురాలి బంధువులకు కువైట్ నుంచి సమాచారం అందినట్లు తెలిపారు. ఈ వార్త వినగానే గ్రామంలో విషాద చాయలు అలుముకున్నాయి. గురువారం లక్ష్మీదేవి తన కుమార్తె హారతి, కుమారుడు చెన్నకేశవ, కుటుంబ సభ్యులతో మాట్లాడిందని బంధువులు తెలిపారు. ఒక్క రోజులోనే తల్లి మృతి వార్త విన్న పిల్లలు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. కడసారైన తమ తల్లిని చూపాలని ప్రభుత్వ పెద్దలను వేడుకుంటున్నారు.
మిద్దైపె నుంచి పడి
గాయాలు
మదనపల్లె : మిద్దైపె నుంచి పడి ఓ వ్యక్తి తీవ్రంగా గాయపడిన సంఘటన శుక్రవారం ఉదయం పట్టణంలో జరిగింది. నక్కలదిన్నెకు చెందిన వెంకటరమణ(62) మిద్దైపె ఆరబోసిన మిరప కాయలను కిందకు తెచ్చేందుకు వెళ్లాడు. కిందకి దిగే క్రమంలో ప్రమాదవశాత్తూ కాలు జారి కింద పడ్డాడు. ప్రమాదంలో తీవ్రంగా గాయపడగా, గమనించిన కుటుంబసభ్యులు వెంటనే ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.
బొలెరో ఢీకొని ఆర్టీసీ డ్రైవర్కు..
బొలేరో వాహనం ఢీకొని ఆర్టీసీ డ్రైవర్కు గాయాలయ్యాయి. మదనపల్లి మండలం చీకలబైలు పంచాయతీ బార్లపల్లెకు చెందిన రామన్న కుమారుడు సుధాకర(50) ఆర్టీసీ డ్రైవర్గా పనిచేస్తున్నాడు. శుక్రవారం వ్యక్తిగత పనులపై ద్విచక్ర వాహనంలో మదనపల్లెకు వచ్చి తిరిగి స్వగ్రామానికి వెళ్తున్నారు. ఎదురుగా వచ్చిన బొలెరో వాహనం ఢీకొంది. ప్రమాదంలో సుధాకర్కు గాయాలయ్యాయి. మెరుగైన వైద్యం కోసం కుటుంబసభ్యులు ప్రైవేట్ ఆస్పత్రికి తీసుకెళ్లారు. తాలూకా పోలీసులు కేసు విచారిస్తున్నారు.