అమెరికాకు ఒంటిమిట్ట రామయ్య తలంబ్రాలు | - | Sakshi
Sakshi News home page

అమెరికాకు ఒంటిమిట్ట రామయ్య తలంబ్రాలు

Mar 15 2025 12:45 AM | Updated on Mar 15 2025 12:45 AM

అమెరి

అమెరికాకు ఒంటిమిట్ట రామయ్య తలంబ్రాలు

ఒంటిమిట్ట : ఒంటిమిట్ట కోదండరామాలయం నుంచి ముత్యాల తలంబ్రాలు, పట్టు వస్త్రాలను అమెరికాకు పంపనున్నారు. సాలాబాద్‌కు చెందిన మల్లారెడ్డి కుమారుడు వెంకటసుబ్బారెడ్డి శుక్రవారం కోదండరాముడికి పట్టు వస్త్రాలు, ముత్యాల తలంబ్రాలు సమర్పించారు. పూజలు పూర్తయిన అనంతరం వాటిని అమెరికా దేశంలోని చికాగోలోని లెమోంట్‌ రామాలయంలో జరగబోయే శ్రీరామనవమి వేడుకల్లో రఘునందుడికి సమర్పించనున్నట్లు ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో ముమ్మడి మల్లారెడ్డి, లలితమ్మ, భానుశ్రీ, తన్వీ, ఈక్షిత, సుదర్శన్‌రెడ్డి, వాసవీ, జశ్వంత్‌రెడ్డి పాల్గొన్నారు.

వెంకట శివసాయి ఆలయం గొప్పది

సంబేపల్లె : మోటకట్ల వెంకటశివసాయి ఆలయం ఎంతో పేరుగాంచిన గొప్ప ఆలయమని వైఎస్సార్‌సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గడికోట శ్రీకాంత్‌రెడ్డి, అన్నమయ్య జిల్లా అధ్యక్షుడు, రాజంపేట ఎమ్మెల్యే అకేపాటి అమరనాథ్‌రెడ్డి పేర్కొన్నారు. ఆలయాన్ని శుక్రవారం వారు సందర్శించారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నూతన ఆలయం నిర్మించి, విగ్రహ ప్రతిష్ఠ వైభవంగా నిర్వహించడం అభినందనీయమన్నారు. ఈ కార్యక్రమంలో వెంకటనాథరెడ్డి విష్ణువర్దన్‌రెడ్డి, వేణుగోపాల్‌రెడ్డి, రామచంద్రారెడ్డి, అమర్‌నాథ్‌రెడ్డి వీవీ.రమణారెడ్డి, నాగభూషణ్‌రెడ్డి, ప్రతాప్‌రెడ్డి, బానుమెర్తి, ఉదయ్‌రెడ్డి, వాసుదేవరెడ్డి, మురళీధర్‌రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.

వైభవంగా మల్లూరమ్మ తిరుణాల

చిన్నమండెం : చిన్నమండెం మండలం మల్లూరు కొత్తపల్లె సరిహద్దున వెలసిన మల్లూరమ్మ జాతర శుక్రవారం వైభవంగా ముగిసింది. అమ్మవారి మూలవిరాట్‌ను పలు రకాల పుష్పాలతో అందంగా అలంకరించారు. భక్తులు చాందినీబండ్లతో వచ్చి ఆలయం చుట్టూ ప్రదక్షిణ చేయించారు. రాయచోటి డీఎస్పీ కొండయ్యనాయుడు, రూరల్‌ సీఐ వరప్రసాద్‌ బందోబస్తు చర్యలు చేపట్టారు. ఎలాంటి అసాంఘిక కార్యకలాపాలు జరగకుండా 250 మంది పోలీసులు పర్యవేక్షించారు. పలు ప్రాంతాల నుండి పెద్ద ఎత్తున భక్తులు తరలివచ్చి అమ్మవారిని దర్శించుకున్నారు.

భార్యా, పిల్లలను నిర్భంధించారని ఫిర్యాదు

కడప అర్బన్‌ : తన భార్య, పిల్లలను బాకీ డబ్బుల కోసం నిర్భంధించారని రాంబాబు అనే వ్యక్తి ఆవేదన వ్యక్తం చేశారు. వేంపల్లికి చెందిన రాంబాబు కడప జిల్లా పోలీసు కార్యాలయంలో ఎస్పీ ఈజీ.అశోక్‌కుమార్‌ను కలిసేందుకు వచ్చారు. ఎస్పీ అందుబాటులో లేకపోవడంతో విలేకరులతో రాంబాబు మాట్లాడుతూ ఓ వ్యక్తి నుంచి తన భార్య గంగాదేవి రూ.45లక్షలు రూ.2కు వడ్డీకి తెచ్చి కార్పొరేషన్‌ ద్వారా వడ్డీలకు ఇచ్చిందన్నారు. ఆ డబ్బు చెల్లించలేదంటూ వారు తన భార్య, పిల్లలను తీసుకెళ్లి నిర్భంధించారన్నారు.

అమెరికాకు ఒంటిమిట్ట రామయ్య తలంబ్రాలు 1
1/4

అమెరికాకు ఒంటిమిట్ట రామయ్య తలంబ్రాలు

అమెరికాకు ఒంటిమిట్ట రామయ్య తలంబ్రాలు 2
2/4

అమెరికాకు ఒంటిమిట్ట రామయ్య తలంబ్రాలు

అమెరికాకు ఒంటిమిట్ట రామయ్య తలంబ్రాలు 3
3/4

అమెరికాకు ఒంటిమిట్ట రామయ్య తలంబ్రాలు

అమెరికాకు ఒంటిమిట్ట రామయ్య తలంబ్రాలు 4
4/4

అమెరికాకు ఒంటిమిట్ట రామయ్య తలంబ్రాలు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement