శ్రీరాముని చరిత్ర సరళంగా రాసిన ఘనత మొల్లది | - | Sakshi
Sakshi News home page

శ్రీరాముని చరిత్ర సరళంగా రాసిన ఘనత మొల్లది

Mar 14 2025 12:07 AM | Updated on Mar 14 2025 12:06 AM

రాయచోటి : సకల గుణాభిరాముడు శ్రీరాముని చరిత్రను సరళంగా రాసిన ఘనత కవయిత్రి మొల్లదని జిల్లా జాయింట్‌ కలెక్టర్‌ ఆదర్శ రాజేంద్రన్‌ పేర్కొన్నారు. గురువారం స్థానిక రాయచోటి కలెక్టరేట్‌లో జిల్లా వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో మొల్లమాంబ జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా జేసీ ఆదర్శ రాజేంద్రన్‌, డీఆర్‌ఓ మధుసూదన్‌ రావు హాజరై పూలమాల వేసి ఘనంగా నివాళులు అర్పించారు. కడప జిల్లా గోపవరంలో జన్మించిన ఆతుకూరి మొల్ల 16వ శతాబ్దపు తెలుగు కవయిత్రి అన్నారు. ఆమె రచన శైలి చాలా సరళమైననది, రమణీయమైనదన్నారు. తాళ్లపాక అన్నమాచార్య సతీమణి తాళ్లపాక తిమ్మక్క తరువాత చెప్పుకోదగ్గ రెండో తెలుగు కవయిత్రి మొల్ల అని కీర్తించారు. ఈ కార్యక్రమంలో అన్నమయ్య జిల్లా శాలివాహన సంఘం జిల్లా అధ్యక్షుడు నాగేంద్ర, లీగల్‌ అడ్వైజర్‌ భద్రయ్య, కలెక్టరేట్‌ ఏఓ నాగభూషణం, వెనుకబడిన తరగతుల శాఖ సిబ్బంది, కలెక్టరేట్‌ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

జిల్లా జాయింట్‌ కలెక్టర్‌ ఆదర్శ రాజేంద్రన్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement